లెక్కా పత్రం లేదు!
రైతులకు ఆర్థిక దన్నుగా నిలవాల్సిన సహకార సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కామవరపుకోట సొసైటీలో ఐదేళ్లలో రూ.3 కోట్ల మేర మింగేశారు.
కామవరపుకోట సహకార సంఘంలో రూ.3 కోట్ల స్వాహా
ఈనాడు డిజిటల్, ఏలూరు
సహకార సంఘ కార్యాలయం
రైతులకు ఆర్థిక దన్నుగా నిలవాల్సిన సహకార సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కామవరపుకోట సొసైటీలో ఐదేళ్లలో రూ.3 కోట్ల మేర మింగేశారు. అక్రమాల్లో సంఘం కార్యదర్శి, సిబ్బంది, బ్రాంచి మాజీ పర్యవేక్షకుడు, పాలకవర్గ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన సహకార శాఖ ఆడిట్లో ఇవి వెలుగులోకి వచ్చాయి.
కామవరపుకోట సహకార సంఘంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రూ.73.40 లక్షలు మింగేశారు. సరైన అంచనాలు, ఎంబుక్స్, బిల్లులు లేకుండా తప్పుడు లెక్కలతో సొసైటీ పెట్రోల్ బంకులో సౌకర్యాలు, రీమోడలింగ్ పేరిట రూ.56.13 లక్షలు గోల్మాల్ చేశారు. అవసరం లేకుండానే జిరాక్సులు, స్టేషనరీ తదితర (అనామతు) ఖర్చులు పెట్టామని బిల్లులు లేకుండానే రూ.8.59 లక్షలు వాడేశారు. డీజిల్ అమ్మకాల్లో 1044 లీటర్లు అక్రమంగా అమ్ముకుని రూ.1.72 లక్షలు దారిమళ్లించారు. రికార్డుల్లో ఖర్చులకు, జమకు పొంతన లేదు. తప్పుడు కూడికలతో రూ.95,858 దుర్వినియోగం చేశారు. ఇలా ఇష్టారాజ్యంగా తప్పుడు లెక్కలతో దోపిడీకి తెరతీశారు. సంఘం పరిధిలోని ఎరువులు, చౌకధరల దుకాణాలు, రెండు పెట్రోల్ బంకుల్లో వ్యాపారం చేస్తున్నా ఒక్కదానిలోనూ లాభం చూపకుండా దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టాలు చూపించి కొన్ని నిధులు దారిమళ్లించారు.
బాధ్యులు వీరే.. ఈ అక్రమాల్లో కార్యదర్శి బాబూరావుతో పాటు సేల్స్మ్యాన్ సీహెచ్ శేఖర్, మాజీ అధ్యక్షుడు కె.రాధాకృష్ణ, మాజీ పర్యవేక్షకుడు జె.కిశోర్రెడ్డిని బాధ్యులుగా చేస్తూ ఆడిట్ అధికారి నివేదిక ఇచ్చారు. వీరినుంచి దుర్వినియోగమైన సొమ్మును వడ్డీతో కలిపి వసూలు చేసి, ఆస్తులు జప్తు చేసి క్రిమినల్, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. గతంలో జరిగిన సెక్షన్ 51 విచారణలో బాధ్యులపై చర్యలకే దిక్కులేదు. ఆడిట్ నివేదికపై ఏం చర్యలు తీసుకుంటారని అధికారులను రైతులు ఎద్దేవా చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి ఆడిటర్లు, మేనేజర్లు, పర్యవేక్షకులు ఏటా తనిఖీలు చేస్తున్నా నిధులు దారిమళ్లినట్లు గుర్తించకపోవడం గమనార్హం.
కంచే చేను మేసింది
2017-19 మధ్య కాలంలో డీసీసీబీ కామవరపుకోట బ్రాంచి పర్యవేక్షకుడిగా పని చేసిన జె.కిశోర్రెడ్డి సంఘం ఇన్ఛార్జి కార్యదర్శిగా కూడా పనిచేశారు. అప్పుడు అడ్వాన్స్ పేరిట రెండు దఫాలుగా రూ.6 లక్షలు స్వాహా చేశారు. సంఘం నిధులు కాపాడాల్సిన బ్యాంకు అధికారే అవకాశం చిక్కడంతో అందినకాడికి నొక్కేశారు.
చర్యలు ఏవీ?
కామవరపుకోట సొసైటీపై 2017లో సెక్షన్ 51 విచారణ చేశారు. పెట్రోలు బంకులో వచ్చిన సొమ్ము స్వాహా చేయడం, బినామీ రుణాలు ఇవ్వడం, రైతులు రుణాలు చెల్లించినా సంఘానికి కట్టకుండా దారి మళ్లించడం చేశారు. ఇలా అన్నీ కలిపి రూ.2 కోట్లపైనే దుర్వినియోగమైనట్లు గుర్తించారు. అప్పటి పాలక వర్గం, కార్యదర్శి, సిబ్బందిని బాధ్యులుగా తేల్చారు. విచారణ అధికారి, డివిజినల్ సహకార అధికారి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పాలక వర్గానికి సూచించారు. అయిదేళ్లు దాటినా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. సంబంధిత అధికారులు మొత్తం ముడుపులు పుచ్చుకుని విషయాన్ని కప్పిపుచ్చారు. చోద్యం ఏంటంటే అప్పుడు బాధ్యుల్లో ఒక్కరైనా సేల్స్మ్యాన్ టి.బాబూరావుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. మరో ఇద్దరు సేల్స్మ్యాన్లు కూడా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు.
* ఈ విషయమై డీసీవో ప్రవీణ వివరణ కోరగా తనిఖీ చేసిన అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!