రహదారి నియమాలే ప్రాణాలకు రక్ష : ఎస్పీ
రహదారి నియమాలే ప్రాణాలకు రక్షణ అని ఎస్పీ రాహుల్దేవ్ శర్మ అన్నారు. ఆర్టీసీ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని స్థానిక గ్యారేజీ ఆవరణలో గురువారం నిర్వహించారు.
వాహన చోదకుడికి పురస్కారం అందిస్తున్న రాహుల్దేవ్ శర్మ చిత్రంలో
డీపీటీవో వరప్రసాద్, ఎంవీఐ విజయరాజు తదితరులు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: రహదారి నియమాలే ప్రాణాలకు రక్షణ అని ఎస్పీ రాహుల్దేవ్ శర్మ అన్నారు. ఆర్టీసీ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని స్థానిక గ్యారేజీ ఆవరణలో గురువారం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎక్కువ శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించడం, కారు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఎంవీఐ విజయరాజు మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ డీపీటీవో వరప్రసాద్ మాట్లాడుతూ చోదకులకు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. అనంతరం ఉత్తమ చోదకులకు పురస్కారాలు అందజేశారు. రహదారి భద్రతపై నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
* ఉత్తమ చోదకులు వీరే.. బీవీఆర్ఎం రావు (జోనల్ స్థాయి ప్రథమ- ఏలూరు), డి.ప్రసాదరావు (జిల్లా స్థాయి ప్రథమ- ఏలూరు), బీపీ రావు (ద్వితీయ- నూజివీడు), జె.చల్లయ్య (తృతీయ- ఏలూరు)
* ఏలూరు డిపో స్థాయిలో.. ఆర్వీ రావు (ప్రథమ), ఎంవీఎస్ఆర్కే కృష్ణ (ద్వితీయ), పీఆర్ శేఖర్ (తృతీయ)
* జంగారెడ్డిగూడెం.. బీకే రెడ్డి (ప్రథమ), డీవీఎస్ఎన్టీ రాజు (ద్వితీయ), ఎస్కేఎం షాహిర్ (తృతీయ)
* నూజివీడు.. డీవీకే రావు (ప్రథమ), కేఆర్ కృష్ణ (ద్వితీయ), బీవీ రావు (తృతీయ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు