logo

60 మంది వైకాపా నేతల పక్కచూపులు

ముఖ్యమంత్రి జగన్‌ అరాచకాలను తట్టుకోలేని 60 మందికి పైగా వైకాపా నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌  వ్యాఖ్యలు చేశారు.

Published : 03 Feb 2023 02:41 IST

తెదేపా ఎమ్మెల్సీ అంగర

పాలకొల్లు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ అరాచకాలను తట్టుకోలేని 60 మందికి పైగా వైకాపా నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌  వ్యాఖ్యలు చేశారు. పాలకొల్లులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లనే ట్యాపింగ్‌ చేయిస్తున్న సీఎం మాట్లాడితే చంద్రబాబును వృద్ధుడని ఎగతాళి చేయడం విడ్డూరమన్నారు. ఆ మాటకొస్తే మనసూ మెదడు పనితీరులో సీఎం జగనే చంద్రబాబు కంటే వృద్ధుడన్నారు. తాను యువకుడిగా భావించే సీఎం రాష్ట్రాన్ని రూ.లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టడం మినహా చేసిందేంటని ప్రశ్నించారు. కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని, ప్రస్తుతం వైకాపా పాలన వెంటిలేటర్‌ మీద ఉందని, త్వరలో అంతిమయాత్ర తప్పదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని