అర్ధరాత్రి వరకు హైడ్రామా
కోడేరు ఇసుక ర్యాంపు సీజ్ వ్యవహారం రచ్చకెక్కింది. అధికార పార్టీ నేతలు, అధికార యంత్రాంగం మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీసింది.
రచ్చకెక్కిన కోడేరు ఇసుక ర్యాంపు సీజ్ వ్యవహారం
తహశీల్దారు ఫిర్యాదు చేసినా నమోదు కాని కేసు
తహశీల్దారు కార్యాలయం వద్ద స్వాధీనం చేసుకున్న వాహనాలు
ఆచంట, న్యూస్టుడే: కోడేరు ఇసుక ర్యాంపు సీజ్ వ్యవహారం రచ్చకెక్కింది. అధికార పార్టీ నేతలు, అధికార యంత్రాంగం మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు సాగించడంతో నరసాపురం సబ్కలెక్టర్ ఆదేశాలతో గురువారం రాత్రి రీచ్లో స్థానిక అధికారులు దాడులు చేసి పొక్లెయిన్లతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. స్వాధీనం చేసుకున్న వాహనాలను తొలుత పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం తహశీల్దారు ఆర్.రాజ్యలక్ష్మి వాహన యజమానులు, డ్రైవర్లతో పాటు జేపీ సంస్థ ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 గంటలకు ఏలూరు నుంచి మైనింగ్ శాఖ అధికారులు వచ్చి తహశీల్దారుతో చర్చలు జరిపారు. రాత్రి 12 గంటల వరకు జరిగిన చర్చలు ఎటూ తేలకపోవడంతో అర్ధరాత్రి వరకు స్టేషన్ వద్ద హైడ్రామా జరిగింది. ఎస్సై అందుబాటులో లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. దీంతో సబ్కలెక్టర్ సూచనలతో రాత్రి 2 గంటల సమయంలో స్టేషన్ వద్ద నిలిపిన వాహనాలను తిరిగి తహశీల్దారు కార్యాలయానికి తరలించారు.
రెండో రోజూ అదే తంతు
రెండో రోజు శుక్రవారం కూడా ఇదే తంతు కొనసాగింది. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదులో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మండల మేజిస్ట్రేట్ అయిన తహశీల్దారు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై పెనుగొండ సీఐ నాగేశ్వరరావును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా దర్యాప్తు సాగుతోందని తెలిపారు.
నిర్వాహకులను వదిలేసి...
రీచ్పై అధికారులు దాడులు చేసిన సమయంలో ఒక టిప్పర్, లారీ, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిలో టిప్పర్ తప్ప మిగిలిన మూడు వాహనాల డ్రైవర్లు ఇసుక నిమిత్తం జేపీ సిబ్బందికి నగదు చెల్లించి రసీదులు పొందారు. అయినా అధికారులు టిప్పర్తో పాటు మూడు వాహనాలను పోలీసు స్టేషన్కు తరలించారు. ఇదే సమయంలో అనధికారికంగా రీచ్ నిర్వహణ చూస్తున్న అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు అక్కడే ఉన్నారు. వీరిని వదిలేసి నగదు చెల్లించిన వాహనదారులను అదుపులోకి తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తహశీల్దారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సైతం ముగ్గురు నాయకుల పేర్లు లేకపోవడం గమనార్హం. రీచ్పై దాడులు జరిగి 36 గంటలు గడుస్తున్నా నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కోడేరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు శుక్రవారం నరసాపురం సబ్కలెక్టర్ సూర్యతేజను కలిసి తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అధికార యంత్రాంగం చర్యలు తీసుకోని పక్షంలో కోర్టులో కేసు వేస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!