logo

ఏలూరు చేరుకున్న సైకిల్‌ యాత్రికుడు

సైకిల్‌పై తీర్థయాత్రలకు వెళ్లిన నగరానికి చెందిన మాజేటి శ్రీరామమూర్తి శనివారం తిరిగి ఏలూరు చేరుకున్నారు.

Published : 05 Feb 2023 03:15 IST

శ్రీరామమూర్తి (సైకిల్‌పై యాత్రకు బయలుదేరినప్పటి చిత్రం)

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: సైకిల్‌పై తీర్థయాత్రలకు వెళ్లిన నగరానికి చెందిన మాజేటి శ్రీరామమూర్తి శనివారం తిరిగి ఏలూరు చేరుకున్నారు. ఆయన గతనెల 17న ఏలూరు నుంచి షిర్డీ, నాసిక్‌, త్రయంబకం ప్రాంతాలను సందర్శించేందుకు సైకిల్‌పై బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్రలోని జ్యోతిర్లింగాలను దర్శించుకున్న అనంతరం తిరిగి ఏలూరు వన్‌టౌన్‌లోని ఆయన స్వగృహానికి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామమూర్తి మాట్లాడుతూ మొత్తం 19 రోజులపాటు, 1,700 కిలో మీటర్ల మేర తన ప్రయాణం సాగిందన్నారు. ఈయన వయసు 75 ఏళ్లు. గతంలోనూ పలుమార్లు సైకిల్‌పై తీర్థయాత్రలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని