చెత్త రుసుముపై కొత్త ఎత్తు!
పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణకు సంబంధించి వినియోగ రుసుములు (యూజర్ ఛార్జీలు) నూరుశాతం వసూలు చేసే దిశగా యంత్రాంగం కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది
ఆస్తి పన్ను తరహాలో వసూలుకు సన్నాహాలు
అవగాహన కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది
భీమవరం పట్టణ, న్యూస్టుడే: పట్టణాల్లో ఇంటింటా చెత్త సేకరణకు సంబంధించి వినియోగ రుసుములు (యూజర్ ఛార్జీలు) నూరుశాతం వసూలు చేసే దిశగా యంత్రాంగం కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ రుసుములను ఆస్తి, కుళాయి పన్నుల తరహాలో వసూలు చేయాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆస్తి పన్ను డిమాండ్ నోటీసుల్లో చెత్త సేకరణ వినియోగ రుసుములను జతచేసి జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
వసూళ్లు నిలిచిపోవడంతో..
2021 అక్టోబరు 1 నుంచి ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. చెత్తను తరలించేందుకు తొలివిడతలో 226 వాహనాలను ప్రైవేటు ఏజెన్సీ ఆధ్వర్యంలో సమకూర్చారు. ఒక్కో వాహనానికి నెలకు రూ. 52 వేల వరకు చెల్లించాల్సి ఉంది. కాగా అన్ని పట్టణాల్లో వినియోగ రుసుములు పూర్తి స్థాయిలో వసూలు కాకపోవడంతో వాహనాలకు చెల్లించాల్సిన వాయిదాలు నిలిచిపోయాయి. వేతనాలు అందకపోవడంతో వాహనాల కార్మికులు ఆందోళనబాట పట్టారు. మరోపక్క ఇంటింటా చెత్త సేకరణ నూరు శాతం అమలుకు రుసుములను తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్త విధానంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధానంపై వార్డు అడ్మిన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో భీమవరం పురపాలక కమిషనర్ ఎస్.శివరామకృష్ణ శనివారం సమావేశం నిర్వహించారు.
2021 అక్టోబరు 1 నుంచి ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. చెత్తను తరలించేందుకు తొలివిడతలో 226 వాహనాలను ప్రైవేటు ఏజెన్సీ ఆధ్వర్యంలో సమకూర్చారు. ఒక్కో వాహనానికి నెలకు రూ. 52 వేల వరకు చెల్లించాల్సి ఉంది. కాగా అన్ని పట్టణాల్లో వినియోగ రుసుములు పూర్తి స్థాయిలో వసూలు కాకపోవడంతో వాహనాలకు చెల్లించాల్సిన వాయిదాలు నిలిచిపోయాయి. వేతనాలు అందకపోవడంతో వాహనాల కార్మికులు ఆందోళనబాట పట్టారు. మరోపక్క ఇంటింటా చెత్త సేకరణ నూరు శాతం అమలుకు రుసుములను తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్త విధానంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధానంపై వార్డు అడ్మిన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో భీమవరం పురపాలక కమిషనర్ ఎస్.శివరామకృష్ణ శనివారం సమావేశం నిర్వహించారు.
*ఇప్పటి వరకు ప్రతి ఇంటి నుంచి నెలవారీ వినియోగ రుసుములు వసూలు చేస్తున్నారు. ఈ విధానంలో మార్పు తెచ్చేలా క్లాప్ యాప్లో పీటీ మ్యాపింగ్ విధానంలో వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రాంతాల ఆధారంగా ప్రతి ఇంటికి రూ.30 నుంచి రూ.90 వరకు, వ్యాపార సముదాయాలు, దుకాణాల స్థాయిని బట్టి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు పన్ను విధించారు. వీటన్నింటిని ఉమ్మడి జిల్లాలో ఉన్న 1,74,454 ఆస్తి పన్ను అసెస్మెంట్లతో సరిపోల్చే ప్రక్రియపై కసరత్తు ప్రారంభించారు.
వివరాలు సరి చూసేందుకే.. ఆస్తి పన్ను ఎసెస్మెంట్లకు తగ్గట్టుగా చెత్త సేకరణ వినియోగ రుసుముల చెల్లింపులు జరుగుతున్నదీ..లేనిదీ తెలుసుకునేందుకు వివరాలు సేకరిస్తున్నామని పురపాలక ఆర్డీ ఎన్వీవీ సత్యనారాయణ చెప్పారు. ఆన్లైన్ నమోదు కోసం కాదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామయ్య సన్నిధిలో.. రామ రాజుల పలకరింపు
[ 18-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వం విషయంలో పోటీ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురై ఆప్యాయంగా పలకరించుకున్న ఘటన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. -
శిబిరాలే.. చికిత్సల్లేవ్
[ 18-04-2024]
తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి. -
ఉద్ధృతంగా ఏలూరు కాలువ
[ 18-04-2024]
ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఏలూరు కాలువ గట్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
వైకాపా అభ్యర్థిపై సా...గుతున్న విచారణ
[ 18-04-2024]
పాలకొల్లు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి గూడాల శ్రీహరిగోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ప్రచారంలో పలు ప్రాంతాల్లో మహిళలకు నగదు, కానుకలు అందజేశారు -
ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్పై కేసు
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. -
ఇక నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
సమరమే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏలూరు పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు -
జగన్... నిన్ను నమ్ముకుంటే కొంప కొల్లేరు
[ 18-04-2024]
‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణకు చర్యలు చేపడతాం. ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర యుద్ధ ప్రాతిపదికన రెగ్యులేటర్లు నిర్మించి కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’ -
ఇంకెంతన్నారు.. వేతనానికే దిక్కు లేదు
[ 18-04-2024]
వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ : కలెక్టర్
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. -
కుల బహిష్కరణ చేశారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
[ 18-04-2024]
సంఘం పెద్దలను నిలదీసినందుకు తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సొంతిల్లన్నారు.. నట్టేట ముంచారు
[ 18-04-2024]
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది. -
ముహూర్తాలతో సమరానికి సై
[ 18-04-2024]
జిల్లాలో రాజకీయం వేడెక్కనుంది. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో పూర్తిస్థాయి ఎన్నికల సందడి మొదలవనుంది.
తాజా వార్తలు (Latest News)
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె