పరిమిత వేగం.. ప్రమాద రహితం
ఎంత వేగంగా వాహనాన్ని నడిపామన్నది కాదు ముఖ్యం.. ఎంత క్షేమంగా గమ్యాన్ని చేరుకోగాలిగామనేదే ప్రధానం అని పలువురు సీనియర్ చోదకులు అన్నారు.
ఉత్తమ చోదకుల అనుభవ పాఠాలు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: ఎంత వేగంగా వాహనాన్ని నడిపామన్నది కాదు ముఖ్యం.. ఎంత క్షేమంగా గమ్యాన్ని చేరుకోగాలిగామనేదే ప్రధానం అని పలువురు సీనియర్ చోదకులు అన్నారు. ఆర్టీసీ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏలూరులో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ చోదకులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. వీరిలో ఒకరు జోనల్ స్థాయిలో ప్రథమ.. మరో ముగ్గురు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరు గత 22 నుంచి 33 ఏళ్లకు పైబడి ఒక్క ప్రమాదానికీ ఆస్కారం ఇవ్వకుండా బస్సులు నడపడం విశేషం. వీరి తమ అనుభవ పాఠశాలను ‘న్యూస్టుడే’కు వివారాలిలా..
అతి వేగం వద్దే వద్దు
నా పేరు బీవీఆర్ఎం రావు. ఏలూరు డిపోలో చోదకునిగా పనిచేస్తున్నా. గత 33 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. వాహనం నడిపేటప్పుడు పరిమిత వేగంతో మాత్రమే పయనించాలి. అతి వేగం అసలు వద్దు. సమయపాలన పాటిస్తే ప్రమాదాలకు అవకాశం ఉండదు. ఇంటి వద్ద ఉండే పరిస్థితులను పదే పదే గుర్తు చేసుకోవడాన్ని మానుకోవాలి. విధుల్లో ఏకాగ్రత వహించాలి. రహదారిపై వచ్చే వాహనాలను ప్రతి క్షణం గమనిస్తూ ఉంటేనే సురక్షితంగా ముందుకు వెళ్లగలం.
వాహనం కండీషన్లో ఉండాలి
నా పేరు డి.ప్రసాదరావు. ఏలూరు డిపోలో చోదకునిగా పనిచేస్తున్నా. గత 33 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. వాహనం ఎల్లపుడు కండీషన్లో ఉండేలా చూసుకోవాలి. కంటి చూపునే బ్రేకుగా వాడుకోవాలి. వాహనం ఆపాల్సిన ప్రాంతానికి కనీసం 200 మీటర్లకు ముందుగానే నెమ్మదిగా బ్రేకు వేస్తూ ఉండాలి. వాహనం నడిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణిలో మాట్లాడకూడదు. మద్యం తాగి నడిపితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే.
ఏకాగ్రత అవసరం
నా పేరు బీపీ రావు. నూజివీడు డిపోలో చోదకునిగా పనిచేస్తున్నా. గత 32 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. వాహనం నడిపేటప్పుడు రహదారి నియమాలు కచ్చితంగా పాటించాలి. ఏకాగ్రతగా వాహనం నడపడం ఎంతో ముఖ్యం. అనువైన పరిస్థితుల్లో మాత్రమే ఇతర వాహనాలను ఓవర్టేక్ చేయాలి. ఫ్లై ఓవర్లపై అసలు చేయకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, వైద్యశాలల వద్ద జాగరూకత వహించాలి. ఏదైనా ఊరి మీదుగా వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా వేగ నియంత్రణ పాటించాలి.
కుటుంబాన్ని గుర్తుంచుకోవాలి
నా పేరు జె.చల్లయ్య. ఏలూరు డిపోలో చోదకునిగా పనిచేస్తున్నా. గత 29 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. వాహనాన్ని నడిపేటప్పుడు మన కుటుంబాన్ని, మనపై ఆధారపడి జీవిస్తున్న వారి గురించి గుర్తుంచుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాన్ని అదుపు తప్పనివ్వబోం. అలాగే బస్సులో 40 నుంచి 50 మంది వరకు ప్రయాణికులుంటారు. వారందరి జీవితాలు చోదకుని చేతిలో ఉన్నాయని గుర్తుంచుకుంటే సురక్షితంగా గమ్యస్థానం చేరుకోగలం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?