logo

సంఘ సభ్యులు ఐక్యంగా ముందుకు సాగాలి

సంఘ సభ్యులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని పద్మశాలి సంఘం ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (పీఈడబ్ల్యూఏ) రాష్ట్ర అధ్యక్షుడు జి.వి.ఎస్‌.రామకృష్ణ సూచించారు.

Published : 06 Feb 2023 05:36 IST

జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభిస్తున్న నాయకులు

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: సంఘ సభ్యులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలని పద్మశాలి సంఘం ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (పీఈడబ్ల్యూఏ) రాష్ట్ర అధ్యక్షుడు జి.వి.ఎస్‌.రామకృష్ణ సూచించారు. ఆదివారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌ సమావేశ మందిరంలో పీఈడబ్ల్యూఏ ప్రాంతీయ సమావేశం జరిగింది. ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల పీఈడబ్ల్యూఏ సంయుక్త ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశంలో రామకృష్ణ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సభ్యత్వాల నమోదు, వివిధ రంగాల్లోని ఉద్యోగులకు సభ్యత్వం కల్పించడం, సంఘ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, మహిళా ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు నీలం వీరవెంకటసత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి గోపికృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా సంఘ అధ్యక్షుడు సత్యనారాయణ, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, మహిళా ఉపాధ్యక్షురాలు పద్మారమణి, సభ్యులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు