logo

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

: ముత్యాలపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు బందన మహాలక్ష్మిరావు ఇంట ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... మహాలక్ష్మిరావు, అతని సోదరుడు శ్రీనివాసరావు(36) భవన నిర్మాణ సెంట్రింగ్‌, రాడ్‌బెండింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నారు.

Published : 06 Feb 2023 05:36 IST

ఎంపీటీసీ మాజీ సభ్యుడికి తీవ్ర గాయాలు

శ్రీనివాసరావు (పాత చిత్రం)

మొగల్తూరు, న్యూస్‌టుడే: ముత్యాలపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు బందన మహాలక్ష్మిరావు ఇంట ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... మహాలక్ష్మిరావు, అతని సోదరుడు శ్రీనివాసరావు(36) భవన నిర్మాణ సెంట్రింగ్‌, రాడ్‌బెండింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ముత్యాలపల్లి పంచాయతీ పరిధి గెదళ్లవంపులో ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా వారిద్దరూ పిల్లర్‌కు ఇనుప ఊచ ఏర్పాటు చేస్తుండగా ఆ ఊచ సమీపంలోని 11 కేవీ విద్యుత్తు తీగకు తగిలింది. దీంతో సోదరులు ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. మహాలక్షిరావుకు చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. శ్రీనివాసరావుకు చేతులు, కాళ్లకు గాయాలవడంతోపాటు భవనం పైనుంచి కింద ఉన్న రాళ్లపై పడ్డారు. తలకు తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం ఇద్దరినీ నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శ్రీనివాసరావు మృతిచెందినట్లు నిర్ధరించారు. మహాలక్ష్మిరావును మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావుకు భార్య, 4, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనకు సంబంధించి మహాలక్ష్మిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.వీరబాబు తెలిపారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని