వాహన మిత్రకు ని‘బంధనాలు!
ఎంతో మంది యువకులు స్వయం ఉపాధి కోసం వాహన రంగాన్ని నమ్ముకున్నారు. వారికి ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ తదితర వాహనాలు కలిగిన అర్హులకు రూ.10 వేల చొప్పున ఇస్తోంది.
పథకానికి దూరమవుతున్న లబ్ధిదారులు
ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే: ఎంతో మంది యువకులు స్వయం ఉపాధి కోసం వాహన రంగాన్ని నమ్ముకున్నారు. వారికి ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ తదితర వాహనాలు కలిగిన అర్హులకు రూ.10 వేల చొప్పున ఇస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత పలు నిబంధనలను విధించింది. ఫలితంగా చాలామంది పథకానికి దూరమవుతున్నారు.
జిల్లాలో 20 వేలకు పైగా ఆటోలు, 12 వేల వరకు ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్లున్నట్లు అంచనా. ఆయా వాహన దారులకు ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. 2019-20 సంవత్సరం పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో వాహనదారులకు అధికారులు అవగాహన కల్పించారు. ఇలా 17,101 మందిని అర్హులుగా గుర్తించి పథకాన్ని అమలు చేశారు. 2020-21 సంవత్సరం 19,521 మందికి ఇచ్చారు. పథకానికి సంబంధించి ఇంట్లో ఒకరు మాత్రమే అర్హులు. మరో వ్యక్తికి కారు, మరేదైన వాహనం ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు. వాహన రిజిస్ట్రేషన్, యజమానికి చోదక అనుమతి పత్రం తప్పనిసరి. విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లకు మించరాదు. ఇలా పలు నిబంధనలు విధించడంతో లబ్ధిదారుల జాబితాలో కోత పడుతోంది. రెండో విడతకు లబ్ధిదారుల సంఖ్య పెరిగినా.. మూడు, నాలుగో జాబితాల్లో పలువురి పేర్లు తొలగించినట్లు తెలుస్తోంది. గతేడాది లబ్ధి పొందిన వారిలో కొందరి పేర్లు లేవు. తమ పేర్లు అర్హుల జాబితాలో ఎందుకు రాలేదని లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వీరికి సూచిస్తుంటే ఇప్పటికే రెండుసార్లు లబ్ధి పొందామని.. కొత్తగా మళ్లీ దరఖాస్తు ఏమిటని నిలదీస్తున్నారు. కొంతమంది వాహనాలు విక్రయించినా రికార్డులు తమ వద్దే ఉంచుకోవడంతో పాత యజమానికే పథకం వర్తిస్తోంది.
ఈ విషయమై ఆర్టీవో శ్రీహరితో ‘న్యూస్టుడే’ మాట్లాడగా అర్హులైన ప్రతి వాహనదారుడికి పథకం వర్తిస్తుందని, ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వెంటనే దరఖాస్తు చేసుకుంటే మళ్లీ వారికి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు.
ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు
నేను వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా మొదటి విడతలో లబ్ధి పొందాను. ఆ మరుసటి ఏడాది అర్హుల జాబితా నుంచి నా పేరు తొలగించారు. ఎందుకు తొలగించారని సచివాలయ సిబ్బందిని అడిగితే ఆన్లైన్ సమస్యతో పరిశీలనలో తొలగిపోయి ఉండవచ్చని తెలిపారు. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్తే మరోసారి దరఖాస్తు చేసుకుంటే తర్వాత జాబితాలో ఎంపిక చేస్తారని వివరించారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ రాలేదు.
బుద్ద నాగ సూర్యనారాయణ, ఆటో డ్రైవర్, ఏలూరు
ఇలా ఇస్తూ అలా లాగేసుకుంటున్నారు
ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు ఇస్తున్నారు. ఎఫ్సీలు, రోడ్డు ట్యాక్స్ చెల్లించలేదంటూ ఆటోను నడిరోడ్డుపై ఆపి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ఇలా ఒక పక్క ఇస్తూనే.. మరో పక్క లాగేసుకుంటున్నారు. నిబంధనల పేరుతో ఎంతోమందికి పథకం రాకుండా చేస్తున్నారు.
బండి గంగాధర్, ఆటో డ్రైవర్
విద్యుత్తు బిల్లు ప్రామాణికం కారాదు.. డ్రైవింగ్ లైసెన్సు ఉన్న ప్రతి ఆటో, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర పథకం వర్తింప చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తు బిల్లు ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. 300 యూనిట్లు రావడం సాధారణం. గ్రామ, వార్డు సచివాలయాలకు నమోదును అప్పగించారు. వారికి సరైనా అవగాహన ఉండటం లేదు. ఇంతకు ముందులా ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో నమోదుకు అవకాశం కల్పించాలి. వాహన మిత్ర నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చాం.
గోపి, అధ్యక్షుడు, ఏపీ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు