వినండయ్యా మా గోడు!
ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
స్పందనకు తరలివచ్చిన అర్జీదారులు
అర్జీల సమర్పణ కోసం వరుసలో...
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, జేసీ అరుణ్బాబు, డీఆర్వో సత్యనారాయణమూర్తి తదితర అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందజేసే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తే వారు జిల్లా కేంద్రం వరకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు.
కొన్ని అర్జీలు ఇలా..
* నూజివీడులోని నాసిన చెరువు పరిధిలో యాభై సెంట్ల భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆ పట్టణానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
* పెదవేగి మండలం సీతారామపురం, చక్రాయగూడెంలో పంట చెరువులను కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని తొలగించాలని సీతారామపురం గ్రామస్థులు కోరారు.
* పెదపాడు మండలం వట్లూరు ఎస్సీ పేటలో డ్రెయినేజీ నిర్మాణం సరిగా లేనందున మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందని స్థానికులు తెలిపారు.
* ఉంగుటూరు మండలం చినవెల్లమిల్లికి చెందిన ఎ.శ్రీనివాసరావు తన కుమార్తె ఆశాజ్యోతి సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధ పడుతోందని ఆర్థిక సహాయం చేయాలని.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించే పింఛను పథకాన్ని తన కుమార్తెకు మంజూరు చేయాలని కోరారు. కలెక్టర్ ఆశాజ్యోతి వద్దకు వచ్చి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారికి సూచించారు.
అప్లోడ్ చేయాల్సిందే: స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించిన ఛాయాచిత్రాల్ని అప్లోడ్ చేయాలని జేసీ అరుణ్బాబు ఆదేశించారు. రెవెన్యూ సంబంధ అర్జీల పరిష్కార చర్యలపై తహశీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం నిర్వహించారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే