ఈదురు గాలుల బీభత్సం
ఈదురు గాలుల బీభత్సం కారణంగా తాటి చెట్టు కూలి రహదారిపై వెళుతున్న ఆటోపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా.. రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన.
ఆటోపై తాటి చెట్టు కూలి చిన్నారి మృతి
నలుగురికి గాయాలు
సంఘటనా స్థలంలో క్షతగాత్రులు
నూజివీడు రూరల్, న్యూస్టుడే: ఈదురు గాలుల బీభత్సం కారణంగా తాటి చెట్టు కూలి రహదారిపై వెళుతున్న ఆటోపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా.. రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన నూజివీడు మండలం మర్రిబంధం-మీర్జాపురం గ్రామాల మధ్య బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై టి.రామకృష్ణ కథనం మేరకు.. ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన చంద్ర, నూజివీడు మండలం సిద్ధార్థనగర్కు చెందిన బత్తుల ప్రభాకరరావు(ఆటోడ్రైవర్), పరిశుద్ధం, నూజివీడుకు చెందిన మాణిక్యంలు బంధువులు. వీరంతా ఆటోలో నూజివీడు మండలం సీతారామపురంలోని వారి బంధువులను పరామర్శించేందుకు వెళ్లారు. వారితో పాటు అన్షు(2)ను వెంట తీసుకెళ్లారు. పరామర్శ అనంతరం తిరిగి నూజివీడు వైపు వస్తుండగా ఒక్కసారిగా ఈదురు గాలుల ఉద్ధృతి మొదలైంది. సంఘటనా స్థలికి వచ్చే సరికి రహదారి పక్కన ఉన్న తాటి చెట్టు కూలి ఆటోపై పడింది. దీంతో వాహనం తుక్కుతుక్కైంది. అందులో ప్రయాణిస్తున్న వారు హాహాకారాలు చేస్తూ రోడ్డుపై పడిపోయారు. సమాచారం అందుకున్న మొబైల్ వాహనంలోని కానిస్టేబుల్, స్థానికులు స్పందించి గాయపడిన చంద్ర, ప్రభాకరరావు, పరిశుద్ధం, మాణిక్యంకు సపర్యలు చేశారు. చిన్నారి అన్షు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి తల్లిదండ్రులు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపలో ఉంటారు. బంధువుల వద్దకు వారి కుమార్తెను పంపగా ఈ ఘోరం జరిగింది. ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రమాదం బారిన పడిన వారు కన్నీరుమున్నీరవుతున్నారు. వారంతా వ్యవసాయ కూలీలు.
ప్రమాదంలో ధ్వంసమైన ఆటో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి