విలీన ముసుగులో కుంభకోణం
వెంకటాపురం, శనివారపుపేట, చొదిమెళ్ల, సత్రంపాడు, పోణింగి, కొమడవోలు, తంగెళ్లమూడి పంచాయతీలను ఏలూరు నగరపాలికలో విలీనం చేశారు.
66 మంది పొరుగు సేవల ఉద్యోగుల తొలగింపు
ముడుపులు తీసుకుని కొత్తవారికి కొలువులు
ఉద్యోగాలు పంచుకున్న నాయకులు, అధికారులు
ఈనాడు డిజిటల్, ఏలూరు
విలీన పంచాయతీల్లో పని చేసే కొందరు పొరుగు సేవల ఉద్యోగులను అకారణంగా తొలగించారు. అధికారులు, నాయకులు కుమ్మక్కై భారీ కుంభకోణం చేశారు. ముడుపులిచ్చినవారికి ఆ కొలువులు కట్టబెట్టారు. అదనపు నియామకాల్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
వెంకటాపురం, శనివారపుపేట, చొదిమెళ్ల, సత్రంపాడు, పోణింగి, కొమడవోలు, తంగెళ్లమూడి పంచాయతీలను ఏలూరు నగరపాలికలో విలీనం చేశారు. ఆయా పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్యకార్మికులు, వాటర్ వర్కర్లు, ట్యాంకు వాచ్మెన్లు, శానిటరి మేస్త్రీలు, ప్రజారోగ్య సిబ్బందిని 2021లో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో విలీనం చేశారు. 437 మంది ఉద్యోగులుంటే వీరిలో అన్ని అర్హతలు ఉన్నా 66 మందిని అకారణంగా తొలగించారు. వీరి స్థానాలను నాయకులకు నచ్చిన..అధికారులకు మెచ్చిన వారితో భర్తీ చేశారు. తొలగించిన వారికి విషయం తెలియక కార్పొరేషన్ చుట్టూ తిరిగారు. అధికారులు మాత్రం రేపు మాపు అంటూ మభ్యపెట్టి చావుకబురు చల్లగా చెప్పారు. తొలగించిన ఉద్యోగులు ఆర్థిక, రాజకీయ బలం లేని వారు కావటంతో చేసేది లేక మిన్నకున్నారు.
నిబంధనలకు తిలోదకాలు
ఉద్యోగుల్లో 66 మందిని తొలగించటంతో పాటు కార్పొరేషన్లో డేటాఎంట్రీ ఆపరేటర్లు అవసరమని మరో 8 మంది కొత్తవారిని ఎంపిక చేసుకున్నారు. కార్పొరేషన్లో ఉద్యోగాల ఖాళీల వివరాలు ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్కు(ఏపీసీఓఎస్) పంపించలేదు. ఇందుకు సంబంధించి నోటిఫికేషనే జారీ చేయలేదు. ధరఖాస్తుల స్వీకరణ, అభ్యర్థుల ఎంపిక, రోస్టర్ నియమాలు ఇవేమీ లేకుండానే కొత్త వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కార్పొరేషన్లో ఉన్నత అధికారి తన బంధువుకు అక్రమంగా డేటాఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పించారు.
తిలాపాపం తలా పిడికెడు
ఉద్యోగుల విలీన ప్రక్రియలో కార్పొరేషన్లో ఓ బడాబాబు, ఓ నియోజకవర్గ నేత, జిల్లాలో స్థాయిలో ఓ ఉన్నతాధికారి, కార్పొరేషన్లో ఉన్నత స్థాయి అధికారి కుమ్మ·క్కై ఉద్యోగాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా ఉద్యోగం పొందిన ఒక్కో ఉద్యోగి రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ ముడుపులు సమర్పించారు. అంటే 66 ఉద్యోగాలకు రూ.3 లక్షల చొప్పున దాదాపు రూ.2 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటికి రాకుండా కార్పొరేషన్ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చిన వారి పేర్లు కూడా పంచాయతీలో పని చేసిన నిజమైన ఉద్యోగుల జాబితాలో చేర్చారు. ఉద్యోగాలు తీసేసిన వారి పేర్లు తొలగించారు. దీంతో కార్పొరేషన్ ఉద్యోగులు పంచాయతీ నుంచి వచ్చిన జాబితాలో ఉన్నవారికి నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చినట్లు మాయ చేస్తున్నారు. ఈ విషయంపై కమిషనర్ వెంకట కృష్ణ దగ్గర ప్రస్తావించగా ఉద్యోగాల భర్తీ విషయంలో పంచాయతీ ఇచ్చిన జాబితాలో వారినే భర్తీ చేశామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.