‘ఆంగ్లం వ్యామోహంలో తెలుగుపై నిర్లక్ష్యం’
ప్రభుత్వం ఆంగ్లం వ్యామోహంలో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పేర్కొన్నారు. సాహిత్య మండలిలో సంఘ ప్రధాన కార్యదర్శి పుల్లాభొట్ల పురుషోత్తం ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.
పురస్కారాలు అందుకున్న కళాకారులతో ఎమ్మెల్సీ సాబ్జీ
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే: ప్రభుత్వం ఆంగ్లం వ్యామోహంలో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పేర్కొన్నారు. సాహిత్య మండలిలో సంఘ ప్రధాన కార్యదర్శి పుల్లాభొట్ల పురుషోత్తం ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గరికపాటి కాళిదాసు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ నేతి సత్యనారాయణశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. కవి సమ్మేళనం ఆకట్టుకుంది. సాహితీ వేత్త డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రతిబింబించేదే నిజమైన సాహిత్యమన్నారు. పుల్లాభొట్ల శ్రీరామమూర్తి స్మారక సాహిత్య పురస్కారాన్ని కల్యాణశ్రీకి, పీఆర్కే కళాట్రస్ట్ ఉగాది కళా పురస్కారాన్ని పౌరాణిక సంగీత దర్శకులు వి.సురేష్రాజుకు ప్రదానం చేశారు. అలివేలు మంగతాయారు, జి.వి.రత్నశిరీష (సంగీతం), నాగాస్త్ర్ (సాహిత్యం), వి.రామాంజనేయ సిద్ధాంతి, ఎం.రాజగోపాలకృష్ణ చౌదరి (పౌరాణిక నాటకం), డి.రాములు (సాంఘిక నాటకం), బి.వర్షిణి (నాట్యం)లకు ఉగాది విశిష్ఠ పురస్కారాలు అందజేశారు. సంగీత దర్శకులు డాక్టర్ ఎస్పీఎస్ వాసు సంగీత కచేరీ, కళాకారుల ‘రామాంజనేయ యుద్ధ ఘట్టం’ నాటిక ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పెదపాటి రామకృష్ణ, ఎండీ ఖాజావలి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.