logo

నిబద్ధతతో పని చేస్తే గుర్తింపు : కొట్టు

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో పని చేస్తూ గుర్తింపు పొందాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Updated : 23 Mar 2023 06:05 IST

దేవాదాయశాఖ సిబ్బందిని సత్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి  సత్యనారాయణ

తాడేపల్లిగూడెం టూటౌన్‌, వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో పని చేస్తూ గుర్తింపు పొందాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఉగాది నేపథ్యంలో బుధవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని మాగంటి ఫంక్షన్‌ హాలులో దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో 2023 ఉగాది పురస్కార కార్యక్రమాన్ని ఆ శాఖ జోన్‌-2 డిప్యూటీ కమిషనర్‌ మేడేపల్లి విజయరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. ముఖ్యమైన దేవాలయాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేవాదాయ ధర్మాదాయశాఖ కాకినాడ డివిజన్‌ పరిధిలో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, కార్యనిర్వహక సిబ్బంది, ఇంజినీర్లు, స్తపతిలు, అర్చకులు, వేద పండితులు, దేవాలయ ఉద్యోగులు, అనువంశిక ధర్మకర్తలు మంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు