నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే
క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి బారిన పడకుండా అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం
నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం
అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది
జిల్లాలో నమోదైన కేసులు
* ఈ ఏడాది జనవరి నుంచి ఇంతవరకు: 685
* గతేడాదిలో నమోదైనవి : 3,684
బుట్టాయగూడెం, పెనుగొండ, పోడూరు, న్యూస్టుడే : క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి బారిన పడకుండా అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని నిర్ధారణ అయితే తగ్గే వరకు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు పోషకాహారం తీసుకుని నివారించుకోవడం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. ఏటా దేశంలో నమోదు అవుతున్న మరణాల్లో క్షయ వ్యాధి మరణాలే సుమారు 4.80 లక్షలు ఉంటున్నాయి. రోజుకు సుమారు 40 వేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రత్యేక యూనిట్ల ద్వారా పరీక్షలు, చికిత్సలు
క్షయ మైక్రో బాక్టీరియం ట్యూబర్క్యులై అనే బాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. రోగి దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా(వెంట్రుకలు, గోర్లు తప్ప) సోకుతుంది. ఈ వ్యాధి రెండు రకాలు. ఒకటి ఊపిరితిత్తులకు సంక్రమించేది. దీనిని కఫం లేదా కళ్లె పరీక్ష ద్వారా నిర్ధరిస్తారు. రెండోది శరీరంలోని ఇతర భాగాలకు సోకేది. దీనిని ఎక్స్రే, స్కానింగ్, ఎఫ్ఎన్ఏసీ ద్వారా తేల్చుతారు.
పోషకాహారం ముఖ్యం
క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్సతో పాటూ పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ పథకం కింద నెలకు రూ.500 చొప్పున ఆర్నెళ్ల పాటు అందిస్తున్నారు. మన్యం ప్రాంతంలో అదనంగా మరో రూ.750 ఇస్తున్నారు.
స్పందిస్తున్న దాతలు
కేంద్ర ప్రభుత్వ పథకంతో పాటూ జిల్లాలో 51 మంది దాతలు 81 మంది క్షయ బాధితులను దత్తత తీసుకుని పోషకాహారంతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందిస్తున్నారు. 482 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల పర్యవేక్షణలో గ్రామాల్లో రోగులకు చికిత్స అందిస్తున్నాం.
డాక్టర్ జి.రత్నకుమారి, జిల్లా క్షయ నివారణాధికారిణి
* నేషనల్ టీబీ ఎలిమినేట్ ప్రోగ్రాం కింద జిల్లాలో బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం, ఏలూరు, లింగపాలెం. కైకలూరు, నూజివీడు, దెందులూరు, భీమడోలులలో టీబీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ చేత ట్రూనాట్ యంత్రం ద్వారా క్షయ పరీక్షలు చేసి నిర్ధరణ అయితే ఉచితంగా చికిత్సలు అందిస్తున్నారు. పీహెచ్సీల్లో మైక్రోస్కోప్ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు జిల్లాలో ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించారు.
మన్యం మండలాల్లో 125 కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’