అంతా మా ఇష్టం
పట్టణ ప్రణాళిక విభాగంలో రాజకీయ నాయకుల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు మున్సిపల్ పరిధిలో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలంటే ముందుగా మున్సిపల్ కమిషనర్, తర్వాత పట్టణ ప్రణాళిక అధికారిని కలవాల్సి ఉంది.
పట్టణ ప్రణాళిక విభాగంలో అధికార పార్టీ నాయకుల దందా
తణుకు, న్యూస్టుడే: పట్టణ ప్రణాళిక విభాగంలో రాజకీయ నాయకుల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు మున్సిపల్ పరిధిలో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలంటే ముందుగా మున్సిపల్ కమిషనర్, తర్వాత పట్టణ ప్రణాళిక అధికారిని కలవాల్సి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. రాజకీయ నాయకుల అండ ఉంటే చాలు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా పనులు చేపట్టవచ్చు అన్న రీతిలో తణుకు ప్రాంతంలో నిర్మాణాలు సాగుతున్నాయి. మున్సిపల్ స్థలాలను సైతం ఆక్రమించి ఎటువంటి సెట్బ్యాక్లు వదలకుండా యథేచ్చగా పనులు సాగిస్తున్నారనే ఆరోపణలపై పరిశీలనకు వెళ్తున్న ప్రణాళిక అధికారులు సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి మమ అనిపిస్తున్నారు.
* ‘అంతా అధికార పార్టీ నాయకుల ఇష్టారాజ్యంగా మారింది. అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేస్తే ఓ ప్రజా ప్రతినిధి నీకు అక్కడ ఏం పని, మా వాడే వదిలేయ్, లేదంటే నిన్ను బదిలీ చేయిస్తా’ అని బెదిరించారని జిల్లాలోని ఓ పట్టణ ప్రణాళికాధికారి వాపోయారు.
* తణుకు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని సుంకవల్లి వారి వీధిలో.. ఆక్రమించి భవనాన్ని నిర్మిస్తున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
* వేల్పూరు రోడ్డు రాజీవ్చౌక్ సమీపంలో అక్రమ బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నారు.
వందల సంఖ్యలో నిర్మాణాలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూ విస్తీర్ణం సరిపోవడం లేదు. దీంతో బహుళ అంతస్తుల సంస్కృతి విస్తరిస్తోంది. కొందరు నిబంధనలు తుంగలో తొక్కి భద్రత లేకుండా భవంతులు నిర్మిస్తున్నారు.
ఈ బహుళ అంతస్తుల భవనాన్ని తణుకులో నిర్మిస్తున్నారు. ఇది అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిదే. అధికార పార్టీలో ఉన్నాం, నిబంధనలు మనకేం పని అన్నట్టుగా కనీసం సెట్బ్యాక్లు వదలకుండా పనులు చేస్తుండటం గమనార్హం.
జిల్లా వ్యాప్తంగా 3200కు పైగా బహుళ అంతస్తుల భవన సముదాయాలు ఉన్నాయి. ఇటీవల పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
సిబ్బంది లేక..
టీడీఆర్ బాండ్ల కుంభకోణం వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్తో పాటు పట్టణ ప్రణాళిక అధికారులను సుమారు ఏడాది కిందట సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి తణుకు మున్సిపాలిటీకి పట్టణ ప్రణాళిక అధికారులు రావాలంటే హడలిపోతున్నారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ విజయవాడ నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరారు. పట్టణ ప్రణాళిక అధికారుల ఖాళీలు మాత్రం భర్తీ కాలేదు.
పేరుకే ఆన్లైన్ విధానం
భవన నిర్మాణాలకు సంబంధించి పారదర్శకంగా అనుమతులు మంజూరు చేయడానికి తెరపైకి తెచ్చిన ఆన్లైన్ విధానం అంతంత మాత్రంగానే సాగుతోంది. అవినీతికి తావు లేకుండా చేస్తామని సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం అక్రమాలను అరికట్టలేకపోతున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణాల ప్లానింగ్లో సంబంధిత అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ నాయకులు సైతం అక్రమ నిర్మాణాల వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చేయి తడపనిదే పని పూర్తికాని దుస్థితి నెలకొంది.
‘నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భవన యజమానులకు నోటీసులు జారీ చేశాం. మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన స్థలాల్లో నిర్మించినా, సెట్బ్యాక్ వదలక పోతే నోటీసులు జారీ చేశాం.’ అని పట్టణ ప్రణాళిక ప్రాంతీయ సంచాలకులు ఎన్.శ్రీనివాస్ తెలిపారు.
* తణుకులోని జాతీయ రహదారిని ఆనుకుని నిర్మిస్తున్న బహుళ అంతస్తుల వాణిజ్య భవనం ఇది. ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా అధికార పార్టీకి చెందిన నాయకుడి అండదండలతో పనులు చేపట్టారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘మా నాయకుడు కట్టుకోమన్నారు. ఏదైనా వస్తే ఆయనే చూస్తారు’ అని నిర్మాణదారులు బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. పట్టణ ప్రణాళిక అధికారులు మాత్రం వారికి నోటీసులు జారీ చేసి మమ అనిపించారు.
* తణుకు నరేంద్ర కూడలి సమీపంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వీధిలో ఎటువంటి సెట్బ్యాక్ వదలకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవనం ఇది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కొమ్ము కాయడంతో నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణం చేపట్టారు. అధికారులు నోటీసులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ