అటకెక్కిన భూసార పరీక్షలు
భూసారంపైనే పంట దిగుబడి ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో నేల సహజ స్వభావం కోల్పోతుంది.
గణపవరం, ఉంగుటూరు, న్యూస్టుడే: భూసారంపైనే పంట దిగుబడి ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో నేల సహజ స్వభావం కోల్పోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు భూసార పరీక్షలు తోడ్పడతాయి. భూమిలో వివిధ మూలకాల పరిమాణం, ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ లోపాన్ని వీటిద్వారా తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా ఏ రకం పంట వేసుకోవచ్చో నిర్ధరించవచ్చు. ఇంతటి కీలకమైన ఈ పరీక్షలను రెండేళ్లుగా నిర్వహించడం లేదు. ఫలితంగా రైతులకు సరైన మార్గదర్శనం ఉండటం లేదు. ఈ ప్రభావం పంట దిగుబడులపై పడుతోంది.
గత ప్రభుత్వ హయాంలో ఏటా భూసార పరీక్షలు నిర్వహించి ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేవారు. తద్వారా ఇష్టానురీతిగా కాకుండా అవసరం మేరకే ఎరువులు వినియోగించేందుకు వీలుండేది. పెట్టుబడి ఖర్చులు తగ్గేవి. 2019లో పైలట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి జిల్లాలో మండలానికి ఓ గ్రామం చొప్పున, 2020లో రైతు భరోసా కేంద్రం పరిధిలో 20 నమూనాల చొప్పున సేకరించి పరీక్షలు చేశారు. కానీ రెండేళ్ల నుంచి వీటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో తాడేపల్లిగూడెంలో భూసార పరీక్ష కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో పనిచేసే సిబ్బందిని ఇతర విభాగాలకు డిప్యుటేషన్లపై బదిలీ చేయడంతో కార్యకలాపాలు మందగించాయి. ఈ ఏడాదైనా భూసార పరీక్షలు చేపడతారా లేదా అనేది ప్రశ్నార్థకమే.
పెట్టుబడి పెరిగింది.. ‘పదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. గతంలో భూసార పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించేవారు. ఆ ఫలితాలకు అనుగుణంగా ఎరువులు కొనుగోలు చేసేవాడిని. ప్రస్తుతం వాటిని నిలిపివేయడంతో ఎరువులను అధికంగా వినియోగించాల్సి వస్తోంది. ఫలితంగా పెట్టుబడి పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటోంది’ అని ముప్పర్తిపాడుకు చెందిన కౌలురైతు కరుణానిధి తెలిపారు.
జూన్ నుంచి మొదలుపెడతాం.. ‘భూసార పరీక్షలు రెండేళ్లుగా నిర్వహించడం లేదు. ఆర్బీకేల ద్వారా జూన్ నుంచి వీటిని ప్రారంభిస్తాం. ఇందుకు అవసరమైన కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం’ అని భీమడోలు సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు సీహెచ్ ఉషారాజకుమారి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి