పోలవరం రైతులకు అదనపు పరిహారం
పోలవరం ప్రాజెక్టు నిమిత్తం 2006 నుంచి 2010 మధ్య సేకరించిన భూములకు ఎట్టకేలకు అదనపు పరిహారం ఇచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
అధికార యంత్రాంగం కసరత్తు
వింజరం గ్రామం
కుక్కునూరు, న్యూస్టుడే: పోలవరం ప్రాజెక్టు నిమిత్తం 2006 నుంచి 2010 మధ్య సేకరించిన భూములకు ఎట్టకేలకు అదనపు పరిహారం ఇచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అప్పట్లో భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.45 లక్షల వరకు పరిహారం ఇచ్చారు. 2017లో జరిగిన భూసేకరణలో ఎకరాకు రూ.10.50 లక్షలు చెల్లించారు. దీంతో ముందుగా భూములిచ్చిన రైతులు తమకు అదనపు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని కలిసి సమస్యను విన్నవించగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో తీసుకున్న పరిహారంతో కలిపి ఎకరాకు రూ.5 లక్షల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఆ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వంటి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఇలా అందిస్తారు... పోలవరం ప్రాజెక్టు కోసం 2006, 2007, 2010 సంవత్సరాల్లో భూసేకరణ చేశారు. మెట్ట భూములకు ఎకరాకు రూ.1.15 లక్షలు, చిన్న నీటివనరుల కింద భూములకు రూ.1.30 లక్షలు, మధ్యతరహా నీటి వనరులతో సాగయ్యే భూములకు రూ.1.45 లక్షల వంతున రైతులకు పరిహారం అందజేశారు. ఆ భూములకు గతంలో ఇచ్చిన పరిహారం పోను మిగిలిన సొమ్ము చెల్లించబోతున్నారు. ఉదాహరణకు ఎకరాకు రూ.1.45 లక్షలు చెల్లించిన భూమికి ఇప్పుడు రూ.3.55 లక్షలు పరిహారం చెల్లిస్తారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అప్పట్లో 8,539.83 ఎకరాలు సేకరించినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
వివరాలు విడుదల.. ప్రభుత్వం నుంచి అదనపు పరిహారం పొందే రైతుల వివరాలను ఏలూరులోని భూసేకరణ కార్యాలయం విడుదల చేసింది. అప్పట్లో జరిగిన అవార్డు సంఖ్య, అందజేసిన పరిహారం, ప్రస్తుతం చెల్లించే మొత్తం వివరాలను అందులో పొందుపరిచారు. ఆ జాబితాలోని రైతులు తమ బ్యాంకు ఖాతా పుస్తకాలు, ఆధార్ కార్డు నకళ్లను సంబంధింత గ్రామ సచివాలయాల్లో అందజేయాలని గ్రామాల్లో చాటింపుల ద్వారా తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపించాలి
[ 23-04-2024]
పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తొలిమెట్టు.. అదిరేట్టు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తాచాటారు. -
మధ్యంతర భృతికి మంగళం
[ 23-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. -
ఎన్నికల ఎర.. యువత విలవిల
[ 23-04-2024]
రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 7,900 పోస్టులకు మాత్రమే డీఎసీˆ్స ప్రకటన ఇచ్చింది.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎసీˆ్స పెడతానని చెబుతున్నా.. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. -
వైకాపా మాయలోపడి రాజీనామాలు చెయ్యొద్దు: నిమ్మల
[ 23-04-2024]
వైకాపా మాయలోపడి వాలంటీర్లు రాజీనామాలు చెయొద్దని, తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు రూ.10 వేతనం ఇస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. -
గ్రంధి ఏనాడైనా పవన్లా సేవ చేశారా?
[ 23-04-2024]
ఓటమి తప్పదని తెలిసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మెగా బ్రదర్స్పై ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామమోహనరావు విమర్శించారు -
చితికిలబడింది
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా చతికిలపడింది. పునర్విభజన అనంతరం జిల్లా గత ఏడాది 22వ స్థానంలో నిలవగా.. ఈసారి 25వ స్థానానికి దిగజారింది. విద్యార్థులు 80.08 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 15.73 శాతం పెరగడం చెప్పుకోదగిన విషయం. -
ప్రగల్భాలు తప్ప.. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఏరి?
[ 23-04-2024]
గ్రామీణ ప్రజల ఇళ్ల వద్దే నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్య విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం మాదే.. -
23వ స్థానంలో పశ్చిమ
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది -
సాయం ఎగనామం
[ 23-04-2024]
తెదేపా హయాంలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలతోపాటు చేతి వృత్తుల వారికి 90 శాతం రాయితీపై ఆదరణ పరికరాలిచ్చి దన్నుగా నిలిచారు. -
మీ బిడ్డనన్నావ్.. నిలువునా ముంచేశావ్!
[ 23-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలు నిర్మించుకున్న కొందరు లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. 2018, 2019 సంవత్సరాల్లో వీరు పనులు ప్రారంభించగా బిల్లులన్నీ 2020లో చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ప్రకటించింది. -
అయిదేళ్లుగా ఏటా నష్టమే!
[ 23-04-2024]
2023 డిసెంబరులో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 12,438 హెక్టార్లలో వరి, 214 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. -
అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి -
హామీల వల వేసి.. ముంచేసి
[ 23-04-2024]
నవంబరు21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ బియ్యపుతిప్ప హార్బరు, కార్గోపోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. -
బోరుపైపు నుంచి మంటలు
[ 23-04-2024]
యలమంచిలి రెవెన్యూ పరిధిలోని కొత్తలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరు పైపు నుంచి సోమవారం మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM