లెక్క తగ్గుతోంది!
కంటే కూతుర్నే కనాలి.. మనసుంటే మగాడిలా పెంచాలి. కానీ పుట్టేది ఆడపిల్లని తెలుసుకుని కొందరు గర్భంలోనే చిదిమేస్తుంటే.. మరికొందరు పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా చెత్త కుప్పల్లోకి విసిరేస్తున్నారు.
పడిపోతున్న బాలికల జననాల సంఖ్య
చాప కింద నీరులా భ్రూణ హత్యలు
పోడూరు, పాలకొల్లు గ్రామీణ, న్యూస్టుడే
పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి వార్డు
కంటే కూతుర్నే కనాలి.. మనసుంటే మగాడిలా పెంచాలి. కానీ పుట్టేది ఆడపిల్లని తెలుసుకుని కొందరు గర్భంలోనే చిదిమేస్తుంటే.. మరికొందరు పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా చెత్త కుప్పల్లోకి విసిరేస్తున్నారు. ఆడపిల్లల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో విధంగా అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో జరుగుతున్న ప్రసవాల్లో మగ శిశువులదే పైచేయి అవుతోంది. వెయ్యి మంది మగవారు ఉంటే సగటున 975 మంది ఆడపిల్లలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఓటర్ల పరంగా మహిళలే ఎక్కువగా ఉన్న జిల్లాలో ఆడ శిశువుల తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. లింగ నిర్ధారణ, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, లేనిపోని అపోహలు వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.
జిల్లాలో ఏటా సుమారు 25 వేల నుంచి 35 వేల కాన్పులు జరుగుతున్నాయి. ఒకరు లేదా ఇద్దరు చొప్పున జననాల్లో సగటున 35 వేల నుంచి 45 మంది శిశువులు పుడుతుంటే వారిలో బాలురే అధికంగా ఉంటున్నారు. ఇదే కొనసాగితే సమస్యలు ఉత్పన్నమవుతాయని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో ప్రతి గర్భిణి, వారి కుటుంబ సభ్యుల కదలికలను గమనిస్తున్నాం. అన్ని స్కానింగ్ కేంద్రాల మీద నిఘా కొనసాగుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడినట్లు తెలిస్తే చర్యలు తప్పవు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. అబార్షన్ కారణాలను సేకరిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రసవాలకు సంబంధించిన నివేదికపై సమీక్షిస్తున్నాం.
డి.మహేశ్వరరావు, డీఎంహెచ్వో, భీమవరం
* గత మూడేళ్లుగా మగ శిశువులే ఎక్కువగా జన్మిస్తున్నారు. కొన్ని ఇళ్లలో బాబు పుడితే ఒక రకంగా.. పాప పుడితే మరో రకంగా చేష్టలు, మాటలతో తల్లులను వేధిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిని అందరూ నియంత్రించాల్సి ఉంది.
ఏం జరుగుతుందంటే..
జిల్లాలో కొన్నిచోట్ల గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చాపకింద నీరులా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇక్కడ కాకపోతే ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని వస్తున్న ఘటనలు లేకపోలేదు. గర్భిణులుగా నమోదైతే వారిని కంటికి రెప్పలా కాపాడాలన్న ఆదేశాలతోపాటు ప్రసవం వరకూ వారి వివరాలు అధికారుల వద్ద ఉండేలా చూడాలి.
* గర్భస్రావాలు జరిగితే అందులో వాస్తవ పరిస్థితిని అధికారులు గుర్తిస్తే కొంత ప్రగతి కనిపించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పరిశీలిస్తే వివిధ కారణాలతో 269 మంది గర్భ విచ్ఛిత్తి చేసుకున్నారు. ఇంకా లెక్కల్లోకి రానివెన్నో అంచనాకు రాలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేటులోనే ఎక్కువగా జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!