క్రైమ్ న్యూస్
ఏలూరు నగరంలోని రైల్వే క్వార్టర్స్ ప్రాంగణంలో ఉన్న చెరువులో ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది.
చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: ఏలూరు నగరంలోని రైల్వే క్వార్టర్స్ ప్రాంగణంలో ఉన్న చెరువులో ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. గురువారం రాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టూటౌన్ ఎస్సై ప్రసాద్ సంఘటనా ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని, ప్రమాదవశాత్తూ పడిపోయాడా..?, ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా..?తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పేలు మందు తాగి ఆత్మహత్యాయత్నం
నూజివీడు పట్టణం, న్యూస్టుడే: చాట్రాయి మండలం పిట్టలవారిగూడేనికి చెందిన ఓ వివాహిత పేలు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలు, ఆమె తల్లి కథనం మేరకు.. సదరు మహిళకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త తరచూ అనుమానిస్తూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం కొట్టడంతో మనస్తాపం చెంది ఇంటి వద్ద పేలు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు నూజివీడు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!
-
Sports News
‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం
-
Movies News
Pareshan movie review: రివ్యూ: పరేషాన్.. రానా సమర్పణలో వచ్చిన చిత్రం మెప్పించిందా?
-
Politics News
Chandrababu: తెదేపా అధికారంలో ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తయ్యేది: చంద్రబాబు