పది పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు.
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్
ఏలూరు టూటౌన్,. న్యూస్టుడే: పది పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టరేట్లో శుక్రవారం ఎస్పీ రాహుల్దేవ్ శర్మతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 100 మీటర్ల లోబడి ఎలాంటి ఫొటోస్టాట్ దుకాణాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్ల వద్ద కూడా చరవాణులు ఉండటానికి వీల్లేదన్నారు. ఆయా కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 26,217 మంది రెగ్యులర్ విద్యార్థులకు 120 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏవీఎస్ఎన్ మూర్తి, జడ్పీ సీఈవో రవికుమార్, జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి రవిసాగర్, డీఎంహెచ్వో ఆశ, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎల్.శ్రీకాంత్, విద్యుత్తు ఎస్ఈ సాల్మన్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి చేయూత అందిస్తామన్నారు. పెదవేగి మండలం రామసింగవరంలో 50 ఎకరాల భూమిని ఆయిల్ఫెడ్ వారికి నూతనంగా పరిశ్రమ, నర్సరీ ఏర్పాటుకు కేటాయించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని, వట్లూరు భోగాపురం గ్రామాల్లో 25 ఎకరాల్లో, ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిశ్రమల శాఖ కేంద్రం జనరల్ మేనేజర్ ఏసుదాసు, డీపీవో మల్లికార్జునరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.