సాగు చేయాలా వద్దా!
ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే గండ్లు పూడ్చే పనులు ప్రారంభిస్తామని మూడేళ్లుగా జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు.
ఇసుక కాలువ ఆయకట్టు రైతుల మల్లగుల్లాలు
పోలవరం, న్యూస్టుడే
గండికి ఎదురుగా రాళ్లతో నిండిన పొలం
ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే గండ్లు పూడ్చే పనులు ప్రారంభిస్తామని మూడేళ్లుగా జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. ఆ మాటలు వినీవినీ విసిగిపోయిన రైతులు ఏటా గండ్లు తాత్కాలికంగా పూడ్చుకుంటున్నా, కొండవాగుల ఉద్ధృతికి అవి ఎక్కడా ఆగడంలేదు. గతేడాది ఆగస్టు 25న ‘ఖరీఫ్ వ్యవసాయం ఇంతేనా?’, ‘అటు వరద.. ఇటు వాగులు’ శీర్షికలతో ‘ఈనాడు’లో వచ్చిన కథనాలపై కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ స్పందించారు. వెంటనే పరిశీలించి నివేదిక అందజేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రామకృష్ణ, జలవనరుల శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, డ్వామా పీడీ రాంబాబులను ఆదేశించారు. వారు ఆగస్టు 26న వచ్చి చూసి వెళ్లడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఇప్పటి వరకూ పనులు ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులకు చెప్పి ప్రయోజనం ఏమిటి.. తలో రూ.వెయ్యి వేసుకుని తాత్కాలికంగా గండ్లు పూడ్చటమా లేక వ్యవసాయం వదిలి వేయడమా అని తర్జనభర్జనలు పడుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం.. ఇసుక కాలువ గండ్ల విషయమై జలవనరుల శాఖ ఈఈ రమేష్బాబును సంప్రదించగా రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మరి సమయం దగ్గర పడుతోందన్న విషయాన్ని ప్రస్తావించగా తమ శాఖ పరిధిలో నిధులు లేవన్నారు.
పోలవరం సమీపంలో కుడిగట్టుకు పడిన గండి
మూడు గండ్లు
కొండలపై నుంచి మెత్తప్పకోట, సున్నాలగండి మీదుగా మైదాన ప్రాంతానికి వచ్చి పడే వాగుల ఉద్ధృతికి పోలవరం సమీపంలోని ఇసుక కాలువ కుడిగట్టుకు మూడు చోట్ల గండ్లు పడుతున్నాయి. మూడేళ్లుగా ఏటా ఈ తంతు జరుగుతూనే ఉంది. గతంలో గండ్లు పడిన వెంటనే అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేయించి అడ్డుకట్ట వేసేవారు. 2019, 2020లో గండ్లు పూడ్చే పనులకు జలవనరుల శాఖ అధికారులు బిల్లులు చేసినా మంజూరు కాకపోవడంతో ఇక పనులు చేయడం మావల్ల కాదంటూ గుత్తేదారులు చేతులెత్తేశారు. దాంతో గట్టు పక్కనున్న రైతులే ఎంత పటిష్ఠంగా గండ్లు పూడ్చినా, వాగుల ధాటికి ఆగడం లేదు. కారణం గట్టుకు ఆనుకుని ఎడమ వైపు పునరావాస కాలనీలు నిర్మించడంతో వాగు ఉద్ధృతి అంతా కుడిగట్టుపైనే పడుతోందని, అక్కడ కాంక్రీట్ గోడ నిర్మించకపోతే పచ్చని పొలాలు ఎందుకూ పనికి రావని రైతులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి
[ 25-04-2024]
ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ ను దాఖలు చేశారు. -
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్