రైతులకు సేవలందించేదెప్పటికో..!
నకిలీ విత్తనాలు, పురుగు మందుల వాడకంతో ఏటా రైతులు పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనికి చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గ స్థాయి సమీకృత వ్యవసాయ, ఆక్వా ప్రయోగశాలలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.
పూర్తి కాని సమీకృత వ్యవసాయ, ఆక్వా ప్రయోగశాలల భవనాలు
పెనుమంట్ర, నరసాపురం గ్రామీణ, న్యూస్టుడే
నరసాపురంలో అసంపూర్తిగా ప్రయోగశాల భవనం
నకిలీ విత్తనాలు, పురుగు మందుల వాడకంతో ఏటా రైతులు పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనికి చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గ స్థాయి సమీకృత వ్యవసాయ, ఆక్వా ప్రయోగశాలలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఏళ్లు గడిచిపోతున్నా ఇంకా పలుచోట్ల నిర్మాణాలు పూర్తికాలేదు. ఫలితంగా భూసార ఫలితాలు, విత్తన నాణ్యత, ఎరువులు, పురుగు మందులు, మేత, నీటి పరీక్షల కోసం రైతులు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందుకోసం భారీగా వెచ్చించాల్సి వస్తోందని కర్షకులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో తాడేపల్లిగూడెం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఈ ప్రయోగశాలలు మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంలో ఇప్పటికే పరీక్ష కేంద్రం నడుస్తోంది. ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. 2020లో అప్పటి పశు, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ నరసాపురంలో, చెరుకువాడ శ్రీరంగనాథరాజు నెగ్గిపూడి(మార్టేరు)లో ఈ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లు దాటినా ఈ భవనాలు పూర్తి కాలేదు. బిల్లులు సకాలంలో మంజూరు కాక పనుల నిలిపివేశారు. ఇంకా విద్యుత్తు పనులు, సామగ్రి ఏర్పాటు చేయాల్సి ఉంది. పాలకొల్లులో పనులు పూర్తయినా వినియోగంలోకి తీసుకురావడం లేదు. ఇతర నియోజక వర్గాల్లోనూ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రయోగశాల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్టేరు ఏడీఏ ప్రసాద్ తెలిపారు.
ప్రయోజనాలు ఇలా...
* విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యత విషయంలో రైతులకు ఏ మాత్రం అనుమానాలు ఉన్నా ఇక్కడ పరీక్ష చేయించుకుని నివేదిక పొందవచ్చు.
* సాగులో కీలకమైన విత్తన పరీక్షల ద్వారా వాటి నాణ్యత, విత్తనం ద్వారా వచ్చే చీడపీడల గురించి తెలుసుకోవచ్చు.
* ఈ ప్రయోగశాలలో భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాల ఆధారంగా పంట మార్పిడి చేసుకొవచ్చు.
* ఆక్వా సాగుకు సంబంధించి సీడ్ విషయంలో పరీక్షలు చేయించుకోవచ్చు.
* వ్యాపారుల మోసాలకు చెక్ పెట్టవచ్చు. నకిలీలతో మోసం చేస్తే ఈ ప్రయోగశాల నివేదిక ఆధారంగా సదరు వ్యాపారి, కంపెనీ నుంచి నష్ట పరిహారం పొందే అవకాశం కలుగుతుంది.
అందుబాటులోకి వస్తేనే...
నాబార్డు ఆర్ఐటీఎఫ్ నిధులతో చేపట్టిన ఈ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థకు అప్పగించారు. ఒక్కో భవనానికి సుమారు 80 లక్షల మేర నిధులు మంజూరు చేశారు. ఈ ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తే జిల్లాలో సుమారు 70 వేల మంది రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేకూరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపించాలి
[ 23-04-2024]
పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తొలిమెట్టు.. అదిరేట్టు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తాచాటారు. -
మధ్యంతర భృతికి మంగళం
[ 23-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. -
ఎన్నికల ఎర.. యువత విలవిల
[ 23-04-2024]
రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 7,900 పోస్టులకు మాత్రమే డీఎసీˆ్స ప్రకటన ఇచ్చింది.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎసీˆ్స పెడతానని చెబుతున్నా.. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. -
వైకాపా మాయలోపడి రాజీనామాలు చెయ్యొద్దు: నిమ్మల
[ 23-04-2024]
వైకాపా మాయలోపడి వాలంటీర్లు రాజీనామాలు చెయొద్దని, తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు రూ.10 వేతనం ఇస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. -
గ్రంధి ఏనాడైనా పవన్లా సేవ చేశారా?
[ 23-04-2024]
ఓటమి తప్పదని తెలిసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మెగా బ్రదర్స్పై ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామమోహనరావు విమర్శించారు -
చితికిలబడింది
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా చతికిలపడింది. పునర్విభజన అనంతరం జిల్లా గత ఏడాది 22వ స్థానంలో నిలవగా.. ఈసారి 25వ స్థానానికి దిగజారింది. విద్యార్థులు 80.08 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 15.73 శాతం పెరగడం చెప్పుకోదగిన విషయం. -
ప్రగల్భాలు తప్ప.. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఏరి?
[ 23-04-2024]
గ్రామీణ ప్రజల ఇళ్ల వద్దే నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్య విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం మాదే.. -
23వ స్థానంలో పశ్చిమ
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది -
సాయం ఎగనామం
[ 23-04-2024]
తెదేపా హయాంలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలతోపాటు చేతి వృత్తుల వారికి 90 శాతం రాయితీపై ఆదరణ పరికరాలిచ్చి దన్నుగా నిలిచారు. -
మీ బిడ్డనన్నావ్.. నిలువునా ముంచేశావ్!
[ 23-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలు నిర్మించుకున్న కొందరు లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. 2018, 2019 సంవత్సరాల్లో వీరు పనులు ప్రారంభించగా బిల్లులన్నీ 2020లో చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ప్రకటించింది. -
అయిదేళ్లుగా ఏటా నష్టమే!
[ 23-04-2024]
2023 డిసెంబరులో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 12,438 హెక్టార్లలో వరి, 214 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. -
అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి -
హామీల వల వేసి.. ముంచేసి
[ 23-04-2024]
నవంబరు21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ బియ్యపుతిప్ప హార్బరు, కార్గోపోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. -
బోరుపైపు నుంచి మంటలు
[ 23-04-2024]
యలమంచిలి రెవెన్యూ పరిధిలోని కొత్తలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరు పైపు నుంచి సోమవారం మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?