మళ్లీ అడ్డగోలు బదిలీలు
వైద్య ఆరోగ్య శాఖలో మళ్లీ అడ్డగోలు బదిలీలకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏఎన్ఎంలను రీ డిప్లాయ్మెంట్ బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకుని కాసులు పండించుకుంటున్నారు.
డిప్లాయ్మెంట్ పేరిట అక్రమాలకు రంగం సిద్ధం
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే
వైద్య ఆరోగ్య శాఖలో మళ్లీ అడ్డగోలు బదిలీలకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏఎన్ఎంలను రీ డిప్లాయ్మెంట్ బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకుని కాసులు పండించుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. గతేడాది డిసెంబరులో రీ డిప్లాయ్మెంట్ పేరుతో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సీనియర్ ఏఎన్ఎంలను బదిలీ చేశారు. అప్పట్లో పలు అక్రమాలు జరిగాయి. సొమ్ములిచ్చిన వారికి కోరుకున్న చోటుకు, మిగిలిన వారిని ఎక్కడెక్కడికో దూరప్రాంతాలకు బదిలీ చేశారు. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. మళ్లీ నాలుగు నెలలు తిరగకుండానే ఇప్పుడు రెండో విడతలో 80 మందిని రీ డిప్లాయ్మెంట్ కోటాలో బదిలీ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో కౌన్సెలింగ్ జరగనుంది. అప్పట్లో చక్రం తిప్పిన ఉద్యోగే మళ్లీ అన్నీ తానై అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శ వినిపిస్తోంది.
జాబితాలు సిద్ధం.. ప్రాధాన్య జాబితాలు వారం రోజుల కిందటే తయారు చేసి ఎవరెవరు ఎక్కడెక్కడనేది ఇంచుమించుగా ఖరారు చేసినట్లు తెలిసింది. మొదటిసారి రీడిప్లాయ్మెంట్లో దూరప్రాంతాలకు వెళ్లిన కొంతమందిని మళ్లీ ఈ జాబితాలో చేర్చడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మొదటి విడత బదిలీలు జరిగిన వారిని రెండో విడతలో చేర్చేందుకు వీలుండదు. కొత్త వారికే ఇప్పుడు అవకాశముంటుంది. కానీ మొదటి విడత బదిలీలు జరిగిన వారిలో 13 మందిని జాబితాలో చేర్చారు. అది కూడా జాబితాలో వారికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. ఇందుకు వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలిసింది.
తాయిలాలు తప్పనిసరి
దూర ప్రాంతాలకు వెళ్లలేక దగ్గరగా వేయించుకునేందుకు పలువురు ఏఎన్ఎంలు చక్రం తిప్పుతున్న ఉద్యోగిని ప్రసన్నం చేసుకుంటున్నారు. మొదటి విడత బదిలీల్లో దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఇప్పుడున్న వాళ్లు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఈ కారణంగా డిమాండ్ పెరగడంతో రేటు పెంచి రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఒక్కొక్కరి వద్ద వసూలు చేస్తున్నట్లు సమాచారం. సీనియారిటీ లిస్టును తనకు ఇష్టం వచ్చినట్లు మార్చేసి అనుకూలమైన వారి పేర్లను ముందు వరుసలో ఉండేలా చూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు అడిగినంత సొమ్ములిచ్చి కోరుకున్న చోటకు బదిలీ జరిగేలా పావులు కదుపుతున్నారు.
ఆరోపణల నేపథ్యంలో మార్చినా..
మొదటి విడత బదిలీల్లో పలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు రావడంతో వైద్య ఆరోగ్య శాఖలో కీలక స్థానాల్లో ఉన్న ముగ్గురు ఉద్యోగులను బదిలీ చేశారు. వారిలో ఒకరు కామవరపుకోట ప్రాంతానికి బదిలీ అయ్యారు. తాజాగా రెండో విడత బదిలీల్లో ఆయనే మళ్లీ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఇందుకు 15 రోజులుగా డీఎంహెచ్వో కార్యాలయంలో తిష్ఠ వేసి జాబితా తయారు చేసినట్లుగా చెబుతున్నారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా.. ఇక్కడ ఆయనకు పనేంటని పలువురు ఉద్యోగులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.
పారదర్శకంగా నిర్వహిస్తాం
రీ డిప్లాయ్మెంట్ బదిలీల్లో ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇంకా కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించలేదు. ప్రాధాన్యం ప్రకారమే బదిలీలు జరుగుతాయి. తగిన విధంగా కౌన్సెలింగ్ నిర్వహించి ఐచ్ఛికాలు ఎంపిక చేసుకునే విధంగా ఏఎన్ఎంలకు అవకాశం కల్పిస్తాం.
డాక్టరు ఆశ, డీఎంహెచ్వో, ఏలూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’