సహకారం అంతా అయోమయం
ఉపాధ్యాయులకు ఆర్థిక దన్నుగా ఉంటుందనుకున్న సహకార సంఘం పరిస్థితి నేడు అయోమయంగా మారింది. ఏళ్లుగా ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆర్థిక దన్నుగా నిలిచిన మండవల్లి- ముదినేపల్లి టీచర్స్ కోఆపరేటివ్ సొసైటీ లావాదేవీలు నిలిచి అగమ్యగోచరంగా మారింది.
ఉపాధ్యాయ కోఆపరేటివ్ సొసైటీలో రూ.55 లక్షల గోల్మాల్?
రుణం చెల్లించినా నోటీసులు
ముదినేపల్లి, న్యూస్టుడే
ముదినేపల్లి సహకార బ్యాంకు
ఉపాధ్యాయులకు ఆర్థిక దన్నుగా ఉంటుందనుకున్న సహకార సంఘం పరిస్థితి నేడు అయోమయంగా మారింది. ఏళ్లుగా ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆర్థిక దన్నుగా నిలిచిన మండవల్లి- ముదినేపల్లి టీచర్స్ కోఆపరేటివ్ సొసైటీ లావాదేవీలు నిలిచి అగమ్యగోచరంగా మారింది. రూ.లక్షల రికవరీ నిలిచిపోవడంతో జిల్లా అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. కాగా, రుణ గ్రహీతల్లో చాలామంది తీసుకున్న రుణం తిరిగి చెల్లించామని, ఇప్పుడు బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించిన రుణం ఖాతాల్లో జమచేయకుండా సొసైటీ పాలకవర్గం తమను నిండా ముంచిందని ఆరోపిస్తున్నారు.
గతమెంతో ఘనం
మండవల్లి, ముదినేపల్లి మండలాల పరిధిలోని ఉపాధ్యాయులంతా కలిసి సుమారు 40 ఏళ్ల కిందట టీచర్స్ కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడ్డారు. దీనిద్వారా సహకార బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని సులభ వాయిదాల్లో చెల్లించేవారు. సుమారు 200 మంది వరకు సభ్యులు ఉన్నారు. 2016 వరకు సుమారు రూ.4 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. అప్పటి వరకు సంఘం రూ. 2.13 లక్షల లాభాల్లో ఉండటంతో పాటు రూ. 20 లక్షలు విలువ చేసే స్థలం ఉన్నట్లు ఆడిట్ నివేదికల్లో తేలింది. ఆ తర్వాత వచ్చిన నూతన కార్యవర్గం రుణాల వసూళ్లపై కార్యవర్గం శ్రద్ధ చూపకపోవడంతో వడ్డీ రూపంలో పెనుభారం పడినట్లు గత ఆడిట్ నివేదికలో తేలింది.
ఎవరు బాధ్యులు..?
మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు తీసుకున్న రుణాన్ని 2017లోనే తిరిగి చెల్లించారు. ఆరేళ్ల తర్వాత రుణం చెల్లించాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో అవాక్కయ్యారు. సంఘ పరిధిలో సుమారు 61 మంది ఉపాధ్యాయులకు సంబంధించి రుణ చెల్లింపు గడువు ముగిసినట్లు బ్యాంకు అధికారులు విద్యా శాఖాధికారులకు జాబితా అందించారు. బదిలీలపై ఇతర మండలాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు.
గుట్టు చప్పుడు కాకుండా..
సొసైటీలో రెండు ప్రధాన సంఘాల నాయకులు ఈ గోల్మాల్ వ్యవహారం బయటకు రాకుండా కొన్ని నెలలుగా నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. సొసైటీ దాదాపు రూ.55 లక్షల మేర బ్యాంకుకు అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో నెలలుగా రికవరీ లేకపోవడంతో దీనిపై విచారణాధికారిని నియమించారు. ఈ విషయమై సొసైటీ అధ్యక్షుడు ఆగొల్లు హరికృష్ణ మాట్లాడుతూ 2021 ఆడిట్ తదుపరి ఇప్పటివరకు సుమారు రూ.27 లక్షలకు పైగా సభ్యుల నుంచి వసూలు చేసి బ్యాంకుకు జమచేశామన్నారు. అయితే వారి పేర్లను బ్యాంకు అధికారులు రికవరీ చేయాల్సిన జాబితాలో చేర్చారన్నారు. ఇంకా 14 మంది ఉపాధ్యాయులకు సంబంధించి ఈపీల రూపంలో సుమారు రూ.45 లక్షలు, మృతి చెందిన మరో ముగ్గురు ఉపాధ్యాయులకు సంబంధించి సుమారు రూ.10 లక్షలు వసూలు కావాల్సి ఉందని తెలిపారు.
చెల్లింపుల బాధ్యత పాలకవర్గానిదే..
ఉపాధ్యాయ సొసైటీ నుంచి వడ్డీ కాకుండా అసలు రూ.55 లక్షల మేర బకాయిలున్నాయి. దీనికి సంబంధించి మండవల్లి, ముదినేపల్లి మండలాల ఎంఈవోలకు సంబంధిత ఉపాధ్యాయుల ఖాతాల నుంచి మినహాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని నాలుగు నెలల కిందటే జాబితాలు పంపించాం. కొంత మంది రుణం చెల్లించామంటూ వస్తున్నా వారి వద్ద సరైన రసీదులు లేవు. రుణ బకాయిల చెల్లింపు బాధ్యత పాలవర్గంపైనే ఉంటుంది.
వీవీఎల్ఎస్ కుమార్, కేడీసీసీ బ్యాంకు మేనేజరు, ముదినేపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు