తరలింపునకు నరకయాతన
‘నూక పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు. ధాన్యం దిగుమతిలో ఇబ్బంది పెడితే సహించం.. ధాన్యం ఆర్బీకేకు అప్పగించే వరకూ రైతు బాధ్యత.
పశ్చిమ ధాన్యం తూర్పుగోదావరి మిల్లులకు
ఆగని రవాణా, వెయిటింగ్ ఛార్జీల బాదుడు
మంత్రి నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
ఈనాడు డిజిటల్, ఏలూరు, తణుకు గ్రామీణం, న్యూస్టుడే
ఇంకా కల్లాల్లోనే ఆరబోస్తున్న ధాన్యం
‘నూక పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు. ధాన్యం దిగుమతిలో ఇబ్బంది పెడితే సహించం.. ధాన్యం ఆర్బీకేకు అప్పగించే వరకూ రైతు బాధ్యత. తర్వాత మిల్లర్లు పిలిచినా వారు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పండి. వెంటనే పరిష్కరిస్తా.’ ఇదీ కొద్ది రోజుల క్రితం ధాన్యం కల్లాలను పరిశీలించినప్పుడు పౌరసరఫరాల మంత్రి కారుమూరి అన్నదాతలకు ఇచ్చిన భరోసా.
మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉన్నా ఆయన సొంత నియోజకవర్గంలో కూడా పరిస్థితులు చక్కబడలేదు. నూకదోపిడీ షరా మామూలే అన్నట్లు సాగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పండిన ధాన్యం ఉమ్మడి తూర్పుగోదావరిలోని మిల్లులకు కేటాయించడంతో రవాణా చేయడం తలకు మించిన భారమవుతోంది.
ఉమ్మడి పశ్చిమలో ధాన్యం మిల్లుల కేటాయింపు రైతులకు భారంగా మారింది. ప్రస్తుతం ఇరగవరం, అత్తిలి, తణుకు తదితర మండలాల్లో ధాన్యాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, తుని, అనపర్తి, రాజోలు, కాకినాడ ఇలా దూర ప్రాంతాల్లోని మిల్లులకు కేటాయిస్తున్నారు. ధాన్యం రవాణాకు రైతులు తంటాలు పడుతున్నారు. స్థానికంగా మిల్లులకు ఇస్తే ట్రాక్టర్ల ద్వారా తరలించేవారు. దూరం కావడంతో తప్పనిసరిగా లారీ ఉండాల్సిందే. సరిపడా ధాన్యం ఉంటేనే లారీ డ్రైవర్లు రవాణా చేస్తున్నారు. ధాన్యం సంచుల్లో నింపి వారాలు గడుస్తున్నా రవాణా కావటం లేదు. ఈ అవస్థలు పడలేక కొందరు రైతులు తక్కువ ధరకే దళారులకే అమ్ముతున్నారు. అత్తిలి మండలానికి చెందిన త్రిమూర్తులు కౌలు రైతు. 110 సార్ల ధాన్యం వర్షాలకు ముందే సిద్ధంగా ఉంది. అధికారుల చుట్టూ తిరిగినా వాహనం పెట్టలేదు. దీంతో విసిగిపోయి సారకు రూ.30 తగ్గించి విక్రయించారు. ఇలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. అధికారులు మాత్రం స్థానిక మిల్లుల నిల్వ సామర్థ్యం పూర్తి కావటంతో దూర ప్రాంతాల మిల్లులకు కేటాయిస్తున్నామని చెబుతున్నారు.
దోపిడీ మామూలే
ప్రభుత్వ లెక్కల ప్రకారం ధాన్యం తరలించేందుకు టన్నుకు రూ.330 మాత్రమే ఇస్తారు. ఇతర జిల్లాల మిల్లులకు కేటాయించడంతో డ్రైవర్లు టన్నుకు రూ.1000 వరకూ వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రవాణా ఛార్జీలతో పాటు మిల్లులో ధాన్యం దించకపోతే వెయిటింగ్ ఛార్జీల పేరుతో రోజుకు రూ.1000 వసూలు చేస్తున్నారు. ఇంతా చేసి ధాన్యం దించుకున్నా నూక పేరుతో 41 కేజీలకు 3 కేజీల వరకు అదనంగా తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల బస్తాకు రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. నూక శాతం ఎక్కువగా ఉందని సమీపంలోని బాయిల్డ్ మిల్లుకు తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఆయా మిల్లుల్లో నూక శాతం తగ్గితే మరి నూక దోపిడీ ఎందుకు జరుగుతుందో అర్థంకాదు. మిల్లులు దూరంగా కేటాయించడంతో అదనపు భారం పడుతోందని..అధికారులు వాహనాలు ఏర్పాటు చేయాలని రైతులు బుధవారం ఇరగవరం తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ అంశంపై జేసీ రామసుందర్రెడ్డిని వివరణ కోరగా ‘స్థానిక మిల్లుల లక్ష్యం పూర్తికావడంతో ఇతర జిల్లాల్లోని మిల్లులకు కేటాయిస్తున్నాం. రైతులకు రవాణా సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
రవాణా చేసే నాథుడు లేరు
మూడెకరాల్లో కౌలు సాగు చేశా. పంట కోసి రెండు వారాలైంది. సకాలంలో సంచులు ఇవ్వక ఇబ్బందులు పడ్డాం. ధాన్యం తూసి పది రోజులైంది. పక్క జిల్లాల మిల్లుల కేటాయించడంతో వాహనదారులు ముందుకు రావడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. ధాన్యం రహదారి పక్కన ఉంచి కాపలా కాస్తున్నా. వర్షం ఎప్పుడు వస్తుందో అని భయంగా ఉంది.
జనార్దనరావు, వేండ్రవారిపాలెం, ఇరగవరం
23 రోజులైనా దిక్కులేదు
3.5 ఎకరాల్లో కౌలు సాగు చేశా. పంట చేతికొచ్చి 23 రోజులైంది. పక్క జిల్లాలో మిల్లు కేటాయించడంతో వాహనదారులు టన్నుకు రూ.1000 అడుగుతున్నారు..వెయిటింగ్ ఛార్జీలు రోజుకు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఇన్ని రోజులైనా అధికారులు రవాణా సౌకర్యం కల్పించలేదు. దీంతో రాత్రీపగలు కాపలా కాస్తున్నాం.
దానేశ్వరరావు, వేండ్రవారిపాలెం, ఇరగవరం
టన్నుకు రూ.వెయ్యి ఇవ్వాలి
నాలుగెకరాలు కౌలుకు సాగు చేశా. పది రోజుల క్రితం ధాన్యం సిద్ధం చేశా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మిల్లు కేటాయించారు. రవాణా ఛార్జీలు టన్నుకు రూ.1000 వరకు అవుతాయి. గత ఏడాది రవాణా చేసిన ధాన్యం నగదే ఇంకా రాలేదు. అక్కడ వెంటనే దించుకోకుంటే వెయింటింగ్ ఛార్జీలు కట్టాలి. నూక పేరుతో రెండు కేజీలు అదనంగా తీసుకున్నారు.
కృష్ణరాజు, కౌలు రైతు, గోటేరు, ఇరగవరం మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!