భవనాల రిజిస్ట్రేషన్లో బాదుడు
ప్రభుత్వం భూములు, స్థలాల విలువలను ఇప్పటికే 20 నుంచి 35 శాతానికి పెంచింది. ఇది చాలదన్నట్టు భవనాల విలువలనూ పెంచడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
స్థిరాస్తి విలువల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం
ఏలూరు వన్టౌన్, న్యూస్టుడే
ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
ప్రభుత్వం భూములు, స్థలాల విలువలను ఇప్పటికే 20 నుంచి 35 శాతానికి పెంచింది. ఇది చాలదన్నట్టు భవనాల విలువలనూ పెంచడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు వరుసగా పెంచి నడ్డివిరుస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలోని 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఆయా ప్రాంతాల భూముల ధరలను బట్టి పూరిగుడిసె నుంచి ఎత్తయిన భవనాల వరకు అన్ని రకాల నిర్మాణాల మార్కెట్ విలువలను ఈ ఏడాది రెసిడెన్షియల్, కమర్షియల్ విభాగాలుగా సవరించారు. వీటితో పాటు బహుళ అంతస్తుల (అపార్ట్మెంట్ల) ధరలకు రెక్కలొచ్చాయి. కమర్షియల్ పరిధిలో అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్కు రూ.1700, మొదటి అంతస్తుకు రూ.1600, రెండో అంతస్తుకు రూ.1500, సెల్లార్, పార్కింగ్ స్థలానికి రూ.1000 చొప్పున పెంచారు. అలాగే పట్టణ ప్రాంతాలు, మేజరు, మైనర్ పంచాయతీలు.. ఇలా ఆయా ప్రాంతాల్లోని విలువల ఆధారంగా సవరణ చేశారు. వీటి ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు వసూలు చేయనున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో రిజిస్ట్రేషన్ ఖర్చు తడిసి మోపెడు కానుంది. తాజాగా పెంచిన ధరలను ఆయా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గురువారం నుంచి సంబంధిత అధికారులు అమలు చేస్తున్నారు.
మరింత భారమే..
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 800 వరకు వివిధ రకాల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వీటి రూపేణా ప్రభుత్వానికి దాదాపు రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తోంది. నిర్మాణాల మార్కెట్ విలువ పెంపులో భాగంగా జిల్లాలో క్రయవిక్రయాల ద్వారా ఏటా రూ.8 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
* ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి వెయ్యి అడుగుల సాధారణ భవనం ఉంది. చదరపు అడుగు విలువ రూ.1200 ఉండేది. ఈ లెక్కన స్థిరాస్తి విలువ రూ.12 లక్షలు కాగా.. రిజిస్ట్రేషన్ ఛార్జీ రూ.90 వేలు పడేది. తాజాగా చదరపు అడుగు విలువ రూ.1400కు పెంచడంతో రిజిస్ట్రేషన్ ఛార్జీ రూ.1.05 లక్షలకు పెరిగింది.
* పట్టణ, నగర పంచాయతీల్లో గోడలున్న పూరిళ్లకు గతంలో చదరపు అడుగు విలువ రూ.190 ఉంటే.. దానిని రూ.200కు పెంచారు. చావిడి మిద్దెల విలువ రూ.290 నుంచి రూ.300కు పెరిగింది. ఇలా సగటున 5 నుంచి 10 శాతం వరకు పెంచారు. ఈ కారణంగా వాటిని కొనుగోలు చేయాలంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు గతంలో కంటే అదనంగా భరించాల్సి వస్తుంది. ఇప్పటికే భూముల విలువలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు భవనాల విలువలు పెంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామయ్య సన్నిధిలో.. రామ రాజుల పలకరింపు
[ 18-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వం విషయంలో పోటీ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురై ఆప్యాయంగా పలకరించుకున్న ఘటన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. -
శిబిరాలే.. చికిత్సల్లేవ్
[ 18-04-2024]
తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి. -
ఉద్ధృతంగా ఏలూరు కాలువ
[ 18-04-2024]
ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఏలూరు కాలువ గట్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
వైకాపా అభ్యర్థిపై సా...గుతున్న విచారణ
[ 18-04-2024]
పాలకొల్లు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి గూడాల శ్రీహరిగోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ప్రచారంలో పలు ప్రాంతాల్లో మహిళలకు నగదు, కానుకలు అందజేశారు -
ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్పై కేసు
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. -
ఇక నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
సమరమే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏలూరు పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు -
జగన్... నిన్ను నమ్ముకుంటే కొంప కొల్లేరు
[ 18-04-2024]
‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణకు చర్యలు చేపడతాం. ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర యుద్ధ ప్రాతిపదికన రెగ్యులేటర్లు నిర్మించి కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’ -
ఇంకెంతన్నారు.. వేతనానికే దిక్కు లేదు
[ 18-04-2024]
వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ : కలెక్టర్
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. -
కుల బహిష్కరణ చేశారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
[ 18-04-2024]
సంఘం పెద్దలను నిలదీసినందుకు తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సొంతిల్లన్నారు.. నట్టేట ముంచారు
[ 18-04-2024]
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది. -
ముహూర్తాలతో సమరానికి సై
[ 18-04-2024]
జిల్లాలో రాజకీయం వేడెక్కనుంది. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో పూర్తిస్థాయి ఎన్నికల సందడి మొదలవనుంది.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!