క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లాకు బంగారు పతకం
క్షయ వ్యాధి రహిత దిశగా ఏలూరు జిల్లా పురోగతి సాధించినందుకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది.
పతకం, ధ్రువపత్రాన్ని కలెక్టర్కు చూపుతున్న అధికారులు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: క్షయ వ్యాధి రహిత దిశగా ఏలూరు జిల్లా పురోగతి సాధించినందుకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డి.ఆశ, అదనపు డీఎంహెచ్వో, జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారిణి జి.రత్నకుమారిలను కలెక్టర్ అభినందించారు. 2015-22 సంవత్సరాల మధ్య క్షయ నియంత్రణ కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గాను ఈ పురస్కారం దక్కిందని కలెక్టర్ తెలిపారు. క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు వైద్య శాఖ కృషి ఒక్కటే సరిపోదని, నివారణ చర్యలపై ప్రజలు తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త జి.రఘు, డీపీఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?