‘నిందితులను అరెస్టు చేయకపోతే స్టేషన్ ముట్టడి’
కలవల శ్రీనివాసరావు హత్యకేసుకు సంబంధించి రెండు రోజుల్లో సర్పంచి, మరో ఇద్దరిని అరెస్టు చేయకపోతే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని తెదేపా నాయకులు నూజివీడు డీఎస్పీ అశోక్కుమార్ గౌడ్కు స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు
చాట్రాయి, న్యూస్టుడే: కలవల శ్రీనివాసరావు హత్యకేసుకు సంబంధించి రెండు రోజుల్లో సర్పంచి, మరో ఇద్దరిని అరెస్టు చేయకపోతే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని తెదేపా నాయకులు నూజివీడు డీఎస్పీ అశోక్కుమార్ గౌడ్కు స్పష్టం చేశారు. మృతుడు శ్రీనివాసరావు భార్య పుష్పావతి తన కుమార్తెలు మౌనిక, మహేశ్వరి, తెదేపా నాయకులతో కలిసి సోమవారం చాట్రాయి స్టేషన్కు వచ్చారు. సర్పంచి ఇంటి ముందు తాము ధర్నా చేస్తుంటే గంటలో అదుపులోకి తీసుకుంటానని హామీ ఇచ్చి విస్మరించారని పుష్పావతి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసు విషయమై తెదేపా నాయకులు మరిడి వెంకటేశ్వరరావు, మందపాటి బసవారెడ్డి, మోరంపూడి శ్రీనివారావు, పుచ్చకాయల నోబుల్రెడ్డి డీఎస్పీతో మాట్లాడారు.
రిజర్వ్డ్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
వెంకటనాగబాబు (పాతచిత్రం)
ముదినేపల్లి, న్యూస్టుడే: ముదినేపల్లిలో రిజర్వ్డ్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..పెనుమల్లికి చెందిన రిజర్వ్డ్ కానిస్టేబుల్ పామర్తి వెంకటనాగబాబు(32) గుడివాడ పోలీసుస్టేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. పిల్లల చదువు నిమిత్తం ముదినేపల్లిలో కాపురం ఉంటున్నారు. పెనుమల్లిలో నిర్వహిస్తున్న సంబరానికి ఆదివారం భార్య, పిల్లలతో వెళ్లి, రాత్రి వారిని అక్కడే ఉంచి ముదినేపల్లికి వచ్చి ఇంటిలో పడుకున్నారు. సోమవారం భార్య ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ముదినేపల్లి వచ్చి, స్థానికుల సహకారంతో తలుపులు పగులగొట్టి చూడగా నేలపై నాగబాబు మృతిచెంది ఉన్నారు. ఫ్యాన్కు చీర వేలాడుతుండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య నాగజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఆత్మహత్య కేసులో తొమ్మిది మంది అరెస్టు
చాట్రాయి, న్యూస్టుడే: చాట్రాయి మండలం సోమవరం పంచాయతీ వార్డు మాజీ సభ్యురాలు కలవల పుష్పావతి భర్త శ్రీనివాసరావు ఆత్మహత్య కేసులో తొమ్మిది మంది నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు ఇన్ఛార్జి ఎస్సై వెంకటేశ్ తెలిపారు. పంచాయతీకి పిలిచి దాడి చేయడంతో పాటు ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేయడంతో మనస్తాపానికి గురై శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోగా 12 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిలో రతికంటి సత్యనారాయణ, కుందేేటి నాగరాజు, కుందేేటి రామకృష్ణ, కుందేేటి శ్రీకాంత్, చెన్ను వెంకటేశ్వరరావు, చెన్ను చైతన్య, కొల్లి మహేశ్వరరావు, కుందేేటి భాస్కరరావు, కుందేేటి గాంధీలను అరెస్టు చేసి ఎన్టీఆర్ జిల్లా నందిగామ న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ