బాస్కెట్బాల్ పోటీల్లో క్రీడాకారిణుల ప్రతిభ
చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే నమ్మకం వారిలో ఉత్సాహం నింపుతోంది.
ఏలూరు తూర్పువీధి, న్యూస్టుడే
చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే నమ్మకం వారిలో ఉత్సాహం నింపుతోంది. ఆటపై మక్కువ.. పతకాలు సాధించాలన్న తపన వారిని ముందుకు నడిపిస్తోంది. చదువులో మంచి మార్కులు సాధిస్తూనే నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రెండేసి గంటల చొప్పున ఏలూరు కస్తూర్బా నగర పాలక బాలికోన్నత పాఠశాల మైదానంలో శిక్షకుడు కె.మురళీకృష్ణ వద్ద తర్ఫీదు పొందుతున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలనేది తమ లక్ష్యమని చెబుతున్నారు.
క్రీడా కోటాలో కొలువు కోసం..
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. మూడేళ్లుగా బాస్కెట్బాల్లో తర్ఫీదు పొందుతున్నా. గతేడాది అమలాపురం హైస్కూలులో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానంలో నిలిచా. ఈ ఏడాది ఫిబ్రవరి 4, 5 తేదీల్లో నూజివీడులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి స్థానం సాధించా. ఈ నెలలో పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో జరిగిన రాష్ట్ర స్థాయి యూత్ పోటీల్లో మూడో స్థానం పొందా. క్రీడా కోటాలో రైల్వేలో ఉద్యోగం సాధించాలనేదే తన లక్ష్యమని దుంపల అమృత తెలిపారు.
జాతీయ స్థాయిలో రాణించాలని..
నేను పదో తరగతి పూర్తి చేశా. నాలుగేళ్లుగా బాస్కెట్బాల్లో శిక్షణ పొందుతున్నా. 2022 జూన్ 16 నుంచి 19 వరకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శాప్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించా. అదే నెలలో విశాఖపట్నం గీతం వర్సిటీలో జరిగిన అండర్-17 విభాగంలో మూడో స్థానంలో నిలిచా. గత నెల 16 నుంచి 19 వరకు ప.గో.జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపర్రు మాంటిస్సోరి హైస్కూలులో జరిగిన రాష్ట్ర స్థాయి యూత్ బాలికల పోటీల్లో మూడో స్థానం పొందా. జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాలనేదే తన ఆశయమని పల్లపు జయశ్రీ తెలిపింది.
నిరంతర సాధనతో..
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఏడాదిన్నర నుంచి బాస్కెట్బాల్లో తర్ఫీదు పొందుతున్నా. గతేడాది అమలాపురంలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించా. హిమాచల్ప్రదేశ్ కాంగ్రాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆరో స్థానంలో నిలిచా. ఈ ఏడాది నూజివీడులో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్-14 విభాగంలో మొదటి స్థానం పొందా. ఇటీవల పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో జరిగిన యూత్ బాస్కెట్బాల్ పోటీల్లో మూడో స్థానం సాధించా. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలనేదే తన ఆశయమని గనిరెడ్డి పూజిత తెలిపారు.
పోలీసు ఉద్యోగం సాధించాలని..
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. మూడేళ్లుగా బాస్కెట్బాల్లో తర్ఫీదు పొందుతున్నా. గతేడాది అమలాపురంలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానంలో నిలిచా. ఈ ఏడాది నూజివీడులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి స్థానం సాధించా. ఇటీవల పాలకొల్లు మండలం ఉల్లంపర్రులో జరిగిన రాష్ట్ర స్థాయి యూత్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచా. క్రీడా కోటాలో పోలీసు ఉద్యోగం సాధించాలనేది తన లక్ష్యమని బాడిత దేవిశ్రీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరతా.. సీఎంకు తెలిపిన భారాస ఎమ్మెల్యే!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్