వదినతో సహజీవనం.. ఆపై హత్య
సహ జీవనం చేస్తున్న మహిళ మెడకు చీరచుట్టి హత్య చేసిన సంఘటన చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతదేహాన్ని పరిశీలిస్తున్న కుటుంబ సభ్యులు
చింతలపూడి పట్టణం, న్యూస్టుడే: సహ జీవనం చేస్తున్న మహిళ మెడకు చీరచుట్టి హత్య చేసిన సంఘటన చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ మల్లేశ్వరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా ఆర్వీ90 గ్రామానికి చెందిన సుశాంత్ ముఖర్జీ తన సొంత అన్న భార్య అర్చనా ముఖర్జీతో(38) వివాహేతర సంబంధం పెట్టుకుని ఏడాది కిందట ఇక్కడకు వచ్చారు. సీతానగరం గ్రామంలో ఉన్న గోద్రేజ్ పామాయిల్ కర్మాగారంలో రోజువారీ కూలీగా చేరాడు. అక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వదినతో సహజీవనం చేస్తున్నాడు. అర్చన ఇంటి వద్ద టైలరింగ్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 3న మధ్యాహ్నం సమయంలో సుశాంత్ ఇంటి నుంచి హడావుడిగా బయటకు వెళ్తుండగా స్థానికులు ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. దీంతో తాను భద్రాచలం వెళుతున్నానని చెప్పారు. సాయంత్రం సుశాంత్ అద్దెకు ఉన్న ఇంట్లో లైట్లు వెలగక పోవడంతో ఎదురింట్లో ఉన్న మహిళ వెళ్లి చూడగా లోపల ఎవరూ కనిపించలేదు. పక్కనే మరుగుదొడ్డి తలుపు తీసి ఉండటం గమనించి వెళ్లి చూడగా అందులో అర్చన కిందపడి ఉండటం గమనించి చుట్టు పక్కల వారికి చెప్పారు. దీంతో కర్మాగారంలో పనిచేస్తున్న గుత్తేదారు మరికొంతమంది అక్కడికి చేరుకుని పరిశీలించగా ఆమెలో కదిలికలు లేకపోవడంతో సహజీవనం చేస్తున్న సుశాంత్కు ఫోన్ చేశారు. అర్చనా ముఖర్జీ అపస్మారకస్థితిలో ఉన్నారని, వెంటనే రావాలని చెప్పడంతో అతను వచ్చేస్తున్నానని చెప్పి కొంతసేపటి తర్వాత చరవాణి స్విచ్ఆఫ్ చేశాడు. అనుమానం వచ్చిన స్థానికులు 4వ తేదీ ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అర్చన మెడకు చీర చుట్టి హత్య చేసినట్లు గుర్తించి ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి ఆచూకీ కోసం గాలించగా వారు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని, సొంత అన్న భార్యతో సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుని అర్చన భర్త, ఆమె అన్నను మంగళవారం చింతలపూడికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు అంగీకరించకపోవడంతో పోస్టుమార్టం అనంతరం అర్చన మృత దేహానికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించినట్లు సీఐ పేర్కొన్నారు. అర్చనాముఖర్జీకి భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా, నిందితుడు సుశాంత్కు భార్య, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్