నీళ్లొచ్చేసినా మందగమనమే!
పశ్చిమ డెల్టాకు సాగునీటి విడుదలను క్రమంగా పెంచుతున్నారు. రెండు మూడు రోజుల్లో శివారు ప్రాంతాలకు జలాలు చేరే అవకాశం ఉంది. కానీ మంజూరైన కొద్దిపాటి ఓఅండ్ఎం పనులూ వేగం పుంజుకోలేదు. వరద నివారణ చర్యలు, సామగ్రిని భద్రపరిచే పనుల కోసం పిలిచిన టెండర్లకు గుత్తేదారుల నుంచి స్పందన కరవైంది.
ఊపందుకోని తూడు తొలగింపు
వరద నివారణ సామగ్రికి పడని టెండర్లు
యండగండి ప్రాంతంలో ఉండి ప్రధాన పంట కాలువలో పేరుకున్న గుర్రపుడెక్క
భీమవరం వ్యవసాయ విభాగం, న్యూస్టుడే: పశ్చిమ డెల్టాకు సాగునీటి విడుదలను క్రమంగా పెంచుతున్నారు. రెండు మూడు రోజుల్లో శివారు ప్రాంతాలకు జలాలు చేరే అవకాశం ఉంది. కానీ మంజూరైన కొద్దిపాటి ఓఅండ్ఎం పనులూ వేగం పుంజుకోలేదు. వరద నివారణ చర్యలు, సామగ్రిని భద్రపరిచే పనుల కోసం పిలిచిన టెండర్లకు గుత్తేదారుల నుంచి స్పందన కరవైంది. దీంతో మూడోసారి టెండర్లు ఆహ్వానించారు.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)లో భాగంగా డెల్టాలో రూ.8.45 కోట్ల అంచనా వ్యయంతో 78 పనులకు ప్రభుత్వం మే నెలాఖరులో ఆమోదం తెలిపింది. వీటిలో తొలి దశలో రూ.7.30 కోట్ల విలువైన 73 పనులకు టెండర్లు పిలవగా 65 ఖరారయ్యాయి. మిలిగిన వాటికి రెండో దశలో గుత్తేదారులను ఆహ్వానించగా రెండు పనులకు మాత్రమే స్పందన వచ్చింది. వరద సామగ్రిని భద్రపరిచే పనులకు టెండర్లు పడకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. యనమదుర్రు డ్రెయిన్ వెంబడి దువ్వ, మీనవల్లూరు, పిప్పర ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఈ పనుల కోసం మూడోసారి టెండర్లు ఆహ్వానించారు. తొలి విడతలో గుత్తేదారులు ముందుకొచ్చిన వాటిలో తూడు తొలగింపు పనులు 60 వరకూ ఉన్నాయి. కొన్నిచోట్ల తూడు తొలగింపు ఇప్పటికీ ఊపందుకోలేదు.
నీటి విడుదల ఇలా..
డెల్టాలో ప్రధాన పంట కాలువలకు సాగునీటి విడుదలను బుధవారం మరికాస్త పెంచారు. ఈనెల 5న విజ్జేశ్వరంలో కాటన్ బ్యారేజీ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీరొదిలారు. ఆరో తేదీన మూడు వేల క్యూసెక్కులిచ్చారు. బుధవారం ఉదయం నుంచి 4 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ జలాలు దువ్వ రెగ్యులేటర్ వద్దకు సాయంత్రానికి చేరాయి. మరో 48 గంటల్లో శివారు ప్రాంతాలకు చేరొచ్చని భావిస్తున్నారు.
చెరువులు వెలవెల..
ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, గణపవరం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఆచంట, పోడూరు తదితర మండలాల్లోని పలు గ్రామాల్లోని చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. సుమారు 20- 25 చెరువుల్లో రెండు, మూడు అడుగుల లోపే ఉన్నాయి. కాలువలన్నీ ప్లాస్టిక్, థర్మాకోల్ వ్యర్థాలతో పాటు ఆక్వా చెరువుల మురుగు పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. ఇలాంటి కాలుష్య జలాలు దిగువకు వెళ్లాక గానీ పల్లెల్లో తాగునీటి చెరువులు నింపే అవకాశం లేదు. కాలువలకు మరో వెయ్యి క్యూసెక్కులకు మించి నీరిస్తే తప్ప వ్యర్థాలన్నీ దిగువకు వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు.
వేగవంతమయ్యేలా చర్యలు
టెండర్లు పడినచోట్ల తూడు తొలగింపు పనులు వేగంగా చేసేలా చర్యలు తీసుకున్నాం. కాలువల్లో వ్యర్థాలన్నీ దిగువకు కొట్టుకుపోయేలా నీరొదులుతున్నాం. బుధవారం 4 వేల క్యూసెక్కులనీరిచ్చాం. వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిన వెంటనే చెరువులను నింపుకోవాలని సూచిస్తున్నాం.
దక్షిణామూర్తి, జలవనరుల శాఖ ఈఈ, శెట్టిపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా