ఆశ చూపి.. అడ్డంగా దోచేసి
జిల్లా కేంద్రం ఏలూరులో భారీ సైబర్ మోసం జరిగింది. రెట్టింపు డబ్బు ఆశ చూపి ‘వైన్’ అనే ఆన్లైన్ యాప్ ద్వారా రూ.లక్షల్లో డబ్బులు సేకరించి నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.
‘వైన్’ యాప్ పేరుతో ఏలూరులో భారీ మోసం
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: జిల్లా కేంద్రం ఏలూరులో భారీ సైబర్ మోసం జరిగింది. రెట్టింపు డబ్బు ఆశ చూపి ‘వైన్’ అనే ఆన్లైన్ యాప్ ద్వారా రూ.లక్షల్లో డబ్బులు సేకరించి నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. ఫిబ్రవరి నుంచి నగరంలో ఈ యాప్ కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండురోజులుగా యాప్ పనిచేయకపోవడంతో డబ్బులు జమచేసిన వారంతా లబోదిబోమంటున్నారు. జిల్లా, నగర వ్యాప్తంగా సుమారు 200 నుంచి 300 వరకు బాధితులుంటారని, వీరంతా కలిపి సుమారు నాలుగైదు కోట్ల రూపాయల వరకు మోసపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు బుధవారం ఏలూరులోని డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కేసు సైబర్ క్రైం విభాగానికి బదిలీ చేస్తామని, పూర్తిస్థాయిలో విచారణ చేసి న్యాయం చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు హామీ ఇచ్చారు.
‘వల’ వేశారిలా.. తొలుత ఈ వైన్ యాప్లో రూ.5,500 డిపాజిట్ చేసిన వారికి 45 రోజుల పాటు రోజుకు రూ.302 చొప్పున రూ.13,590, రూ.10 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ.1,700 చొప్పున 30 రోజులకు రూ.51,000, రూ.95 వేలు కడితే రోజుకు రూ.12 వేలు చొప్పున 30 రోజుల పాటు రూ.3,60,000 ఆన్లైన్ ద్వారా ఖాతాల్లో వేసేవారు. దీంతో చాలా మంది సొమ్ముకు ఆశపడి రూ.2 లక్షలు, రూ.4 లక్షలు, రూ.6 లక్షలు ఇలా డిపాజిట్ చేశారు. నగరంలోని ఓ కారు ట్రావెల్స్కి సంబంధించిన డ్రైవర్లు చాలా మంది బాధితులుగా ఉన్నారు. కొంతమంది సొంత కార్లు తాకట్టు పెట్టి డబ్బులు డిపాజిట్ చేశారని తెలుస్తోంది. వారంతా సుమారు రూ.40 లక్షల మేర పోగొట్టుకున్నట్లు సమాచారం. మోసపోయిన వారిలో పలు ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు కూడా ఉన్నారు. గత నెల 30న ఈ గ్రూపులో స్పెషల్ ఆఫర్ పెట్టామంటూ వల వేశారు. ఆ ఒక్కరోజే రూ.కోటి వరకు యాప్కు జమైనట్లు తెలిసింది. అనంతరం నాలుగైదు రోజులకు యాప్ కార్యకలాపాలు నిలిపివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిండేసే రోగం.. నిలబెట్టదే వైద్యం!
[ 28-03-2024]
డయాలసిస్ చేయించుకోలేక రోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ఉమ్మడి జిల్లాలో తగినన్ని ఆసుపత్రులు, సదుపాయాలు లేకపోవడంతో రోగులు నరకం చూస్తున్నారు. -
కైకలూరు బరిలో కామినేని
[ 28-03-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి కైకలూరు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేరు ఖరారైంది. బుధవారం భాజపా అధిష్ఠానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. -
ఆదుకుంటాం.. అండగా ఉంటాం
[ 28-03-2024]
తెదేపా అధినేత అక్రమ అరెస్ట్ను తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శ్రీకారం చుట్టిన ‘నిజం గెలవాలి’ రెండో రోజు యాత్ర బుధవారం ఉమ్మడి జిల్లాలో కొనసాగింది. -
దిగుబడి లేక దిగాలు
[ 28-03-2024]
ఖరీఫ్, రబీలో అపరాలు సాగు చేస్తేనే రైతులకు గిట్టుబాటయ్యేది. అయితే కొన్నేళ్ల నుంచి డెల్టాలో ఏడాదికి సీజన్బట్టి రెండు పంటలు సాగు చేస్తే ఒకదానిలో నష్టమొచ్చినా మరో పంటలో ఆ లోటు భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. -
వైకాపా ఆటలు సాగవు :భాజపా
[ 28-03-2024]
రాష్ట్రంలో అయిదేళ్లుగా అరాచక పాలన కొనసాగిందని.. కేంద్ర పథకాలను వారే అమలు చేస్తున్నట్లు వైకాపా ప్రచారం చేసుకుందని.. -
పేరు వెల్లువ.. తీరు వెలవెల!
[ 28-03-2024]
పాడి రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించింది. -
పొలం చూపించారు.. కొండ కేటాయించారు!
[ 28-03-2024]
ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ సర్వస్వం కోల్పోతున్న గిరిజనులు దగాకు గురవుతున్నారు. భూమికి భూమి ఇచ్చేందుకు రూ.లక్షలు చెల్లించి పలువురు రైతుల నుంచి భూ సేకరణ చేశారు. -
జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల
[ 28-03-2024]
జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ -
అయిదేళ్లలో.. గుప్పెడు మట్టీ తీయలే!
[ 28-03-2024]
పశ్చిమ డెల్టాలో మురుగు పారుదల వ్యవస్థ నానాటికీ తీసికట్టుగా మారతోంది. ప్రధాన డ్రెయిన్లలో ఒకటైన చినకావరం కాలువ ఆక్రమణలు, పూడికతో ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోతోంది. -
చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. -
బీఎస్పీ అభ్యర్థులు వీరే
[ 28-03-2024]
బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య