చెరువు తవ్వకాలు మళ్లీ ప్రారంభం
ముదినేపల్లి మండలంలో ఆక్వా చెరువుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. కొంత కాలంపాటు ప్రభుత్వం అనుమతులు నిలుపుదల చేయడంతో ఈ ఏడాది అధికారిక తవ్వకాలు మందకొడిగా సాగాయి. ఈ నెల నుంచి జిల్లా కమిటీ మళ్లీ అనుమతులు ఇస్తుండటంతో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కోమర్రు, దేవరం గ్రామాల్లో ప్రారంభించారు.
కోమర్రులో సాగుతున్న తవ్వకం
ముదినేపల్లి, న్యూస్టుడే: ముదినేపల్లి మండలంలో ఆక్వా చెరువుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. కొంత కాలంపాటు ప్రభుత్వం అనుమతులు నిలుపుదల చేయడంతో ఈ ఏడాది అధికారిక తవ్వకాలు మందకొడిగా సాగాయి. ఈ నెల నుంచి జిల్లా కమిటీ మళ్లీ అనుమతులు ఇస్తుండటంతో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కోమర్రు, దేవరం గ్రామాల్లో ప్రారంభించారు. కనీసం పెగ్ మార్కింగ్ ఇవ్వకుండా, సీఫేజ్ ఛానల్కు స్థలం వదలకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారుల వరకు, పంట, మురుగు కాలువలు పూడ్చి గట్లు వేస్తున్నారు. తాజాగా దేవరంలో సుమారు 15 ఎకరాల్లో చెరువు తవ్వకానికి యత్నించగా గ్రామస్థులు అడ్డుకుని పొక్లెయిన్లు వెనక్కి పంపించేశారు. అదే గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో చెరువు తవ్వేందుకు పొక్లెయిన్లు తీసుకురాగా.. సరిహద్దు గ్రామమైన గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామస్థులు తమ నివాసాలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు తవ్వకానికి అనుమతులు ఇవ్వొద్దని గతంలో అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా వాటిని పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆర్ఐ శివకుమార్ను సంప్రదించగా అనుమతి లేని ప్రాంతాల్లో తవ్వకాలను అడ్డుకుంటామన్నారు. మార్కింగ్ ప్రకారం తవ్వుతున్నారా లేదా అనేది పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా చెరువు తవ్వకాలకు అభ్యంతరాలుంటే ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!