పునాదుల్లోనే ఆగిపోయాయ్!
వీరవాసరం మండలం కొణితివాడ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ‘నాడు- నేడు’ రెండో విడతలో చేపట్టిన అదనపు తరగతి గదుల భవనం నిర్మాణమిది. మూడు విడతల్లో మంజూరైన రూ.32 లక్షలతో ప్రారంభించారు.
నాడు- నేడు రెండో విడత పనుల తీరిది
వీరవాసరం, భీమవరం పట్టణం, న్యూస్టుడే: మరో మూడు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. సెలవులు పూర్తి చేసుకున్న విద్యార్థులు కొత్త ఉత్సాహంతో బడిబాటకు సిద్ధమవుతున్నారు. చక్కటి గదులు, వసతులతో స్వాగతం చెప్పాల్సిన ప్రభుత్వ విద్యాలయాలు అసంపూర్తి పనులతో వెలవెలబోతున్నాయి.
వీరవాసరం మండలం కొణితివాడ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ‘నాడు- నేడు’ రెండో విడతలో చేపట్టిన అదనపు తరగతి గదుల భవనం నిర్మాణమిది. మూడు విడతల్లో మంజూరైన రూ.32 లక్షలతో ప్రారంభించారు. కానీ ప్రస్తుతం పాఠశాల ఖాతాలో ఉన్న రూ.3 లక్షల్లో రూ.70 వేలను సమీప మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేయడంతో ఈ పనులు నిలిచిపోయాయి.
జిల్లాలో పలు పాఠశాలల్లో ‘నాడు-నేడు’ రెండో విడత పనుల తీరుపై కలెక్టర్ ప్రశాంతి ఇటీవల నిర్వహించిన సమీక్షలో అసహనం వ్యక్తం చేశారు. 40 రోజుల్లో చేయాల్సిన పనులు 10 రోజుల్లో హడావుడిగా చేస్తే నాణ్యత ప్రశ్నార్థకమవుతుందని అధికారులను హెచ్చరించారు.
ఇదీ పరిస్థితి..
* వీరవాసరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 11 గదులు నిర్మించాలని నిర్ణయించారు. తొలుత ఒక భవనంపై తొలివిడత మంజూరైన రివాల్వింగ్ ఫండ్తో మూడు గదుల నిర్మాణం చేపట్టారు. రెండో దఫా విడుదలైన రూ.13.50 లక్షల్లో రూ.2 లక్షల వరకు ఖర్చుచేశారు. ఇంతలోనే మిగిలిన నిధులను నాడు- నేడు కాంపొనెంట్ పనులకు కేటాయించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ మొత్తాన్ని రాయకుదురు- 1, పెదజువ్విపాలెం, కొణితివాడ స్పెషల్ మండల పరిషత్ పాఠశాలల బ్యాంకు ఖాతాలకు జమ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఇక్కడ అదనపు గదుల నిర్మాణాలు నిలిచిపోయాయి.
* భీమవరం పట్టణ పరిధి శ్రీరామపురంలోని రాజరాజేశ్వరి పాఠశాల ఆవరణలో ప్రస్తుతం వివిధ పనులను హడావుడిగా చేస్తున్నారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి గదులను శుభ్రం చేయకపోతే విద్యార్థులు కూర్చొనేందుకు చోటు ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
* ఆచంట నియోజకవర్గ పరిధిలో 148 పాఠశాలల్లో ప్రారంభించగా 34 శాతం పూర్తయ్యాయి. పెనుమంట్ర మండలం ఆలమూరులో టైల్స్ పనులు జరుగుతున్నాయి. పొలమూరులో అదనపు గదుల నిర్మాణం పూర్తికాలేదు.
మరమ్మతులకే ప్రాధాన్యం..
‘నాడు-నేడు’ రెండో దశలో ఉన్నత పాఠశాలల్లో గదుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 860 గదుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. దాదాపు అన్నిచోట్లా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పనులు ప్రారంభించారు. ఫిబ్రవరి నెలాఖరునాటికి వీటిని పూర్తి చేయాలనుకున్నా చాలా చోట్ల పునాది దశ దాటలేదు. కొన్నిచోట్ల తరగతి గదుల్లో సిమెంటు, క్రీడా ప్రాంగణాల్లో ఇసుక, నిర్మాణ సామగ్రి ఉంది. ప్రస్తుతం గదుల నిర్మాణం కంటే మిగిలిన చిన్నపాటి పనులు, మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు చేపపట్టేందుకు గుత్తేదారులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మరమ్మతులు, అదనపు తరగతులు, ఇతరత్రా పనులు నాణ్యతతో జరుగుతున్నాయని డీఈవో ఆర్.వెంకటరమణ చెప్పారు.
శ్రీరామపురం రాజరాజేశ్వరి పాఠశాల వద్ద కొనసాగుతున్న పనులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి
[ 25-04-2024]
ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ ను దాఖలు చేశారు. -
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!