ప్రజారోగ్యంపై విషం
పరిశ్రమల కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయు కాలుష్యంతో పాటు భూ గర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండే తణుకు ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
చిమ్నీ ద్వారా వెలువడుతున్న పొగ
తణుకు, న్యూస్టుడే: పరిశ్రమల కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. వాయు కాలుష్యంతో పాటు భూ గర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉండే తణుకు ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ఉదాసీనతతో..యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ.. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే పంట కాలువల్లోకి పరిశ్రమల వ్యర్థాలు వదులుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రధాన పంట కాలువలైన నరసాపురం, యనమదుర్రు, గోస్తనీ కాలువలు కాలుష్య కాసారాలుగా మారాయి. తణుకు పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాలను నేరుగా కాలువల్లోకి వదులుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా వ్యర్థాలను శుద్ధి చేయాల్సి ఉండగా ఎక్కడా ఈ ప్రక్రియ అమలు కావడం లేదు. పరిశ్రమల్లో వ్యర్థాలను శుద్ధి చేసేందుకు(ఈటీపీ) ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే నామ మాత్రంగా ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటికీ నేరుగా వ్యర్థాలను కాలువల్లోకి వదులుతున్నారు. జిల్లాలో ప్రధానంగా తణుకు ప్రాంతంలో పెరవలి, అత్తిలి మండలం తిరుపతిపురం, తణుకు మండలం దువ్వ ప్రాంతాల్లో రొయ్యల శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వీటి ద్వారా అత్యంత ప్రమాదకరమైన వ్యర్థాలు వెలువడుతుంటాయి.
శుద్ధి చేయకుండానే..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 72 భారీ, నాలుగు వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ప్రధానంగా రొయ్యల శుద్ధి కర్మాగారాలు, కెమికల్స్, అట్టల తయారీ, స్పిన్నింగ్, ఆయిల్ తయారీ, పేపర్, సిరామిక్, సీ ఫుడ్స్, కొబ్బరి, రొయ్యల ఫీడ్ తయారీ, ధాన్యం మిల్లులు వంటి పరిశ్రమలు ఉన్నాయి. సాధారణంగా వ్యర్థాలను శుద్ధి చేసి అనంతరం వచ్చిన నీటిని ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తుంటారు. దీని కోసం ప్రతి కర్మాగారంలో ఈటీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని పరిశ్రమలకు అవి అలంకారప్రాయంగా మారాయి. వీటిపై కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటుంది. దీంతో కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థాలను సైతం పంట కాలువలోకి మళ్లిస్తున్నారు. ఈ కాలుష్యంతో కాలువల్లో చేపలు, జలరాశులు మృత్యువాత పడుతున్నాయి. మరో వైపు కర్మాగారాల్లోని బాయిలర్ల నుంచి వెలువడే వాయు కాలుష్యంతో పలువురు రోగాల బారిన పడుతున్నారు. పొగ వెలువడే చిమ్నీలకు చిక్కాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో భాగంగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా రొయ్యల శుద్ది కర్మాగారాలు విస్తరిస్తున్నాయి. తణుకు పరిసర ప్రాంతాల్లోనే పదుల సంఖ్యలో ఇవి ఉన్నాయంటే పరిస్థితి అర్థమవుతోంది. వీటి ఏర్పాటుకు ఆయా కర్మాగారాల పరిధిలో హేచరీలు ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా రొయ్యలను శుద్ధి చేసి విదేశాలకు ఎగుమతులు చేయాలి. దీనిపై ఎక్స్పోర్టింగ్ ఏజెన్సీ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. క్షేత్ర స్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఒక్కోసారి విదేశాలకు వెళ్లిన కంటైనర్లు తిరిగి వస్తున్నాయి. ఇటీవల అత్తిలి మండలం తిరుపతిపురంలో ఓ సంస్థకు చెందిన కంటైనర్ను వెనక్కి పంపించారు.‘సీ ఫుడ్ పరిశ్రమలకు తప్పనిసరిగా ఈటీపీ ప్లాంట్లు ఉండాలి. వాటిని ఉపయోగించకపోతే చర్యలు తప్పవు. కొన్ని కర్మాగారాలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశాం’ అని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్వరరావు అన్నారు.
ఓ పరిశ్రమ నుంచి శుద్ధి చేయకుండా పంట బోదెలోకి వదులుతున్నవ్యర్థాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామయ్య సన్నిధిలో.. రామ రాజుల పలకరింపు
[ 18-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వం విషయంలో పోటీ ఎదుర్కొంటున్న ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురై ఆప్యాయంగా పలకరించుకున్న ఘటన ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. -
శిబిరాలే.. చికిత్సల్లేవ్
[ 18-04-2024]
తణుకులో మొదటివిడత ఆరోగ్య సురక్ష శిబిరాల్లో శస్త్రచికిత్సలు చేయాల్సిన వారిని సుమారు 80 మందిని గుర్తించగా, 20 మందికి మాత్రమే పూర్తయ్యాయి. -
ఉద్ధృతంగా ఏలూరు కాలువ
[ 18-04-2024]
ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఏలూరు కాలువ గట్టుపై నుంచి ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
వైకాపా అభ్యర్థిపై సా...గుతున్న విచారణ
[ 18-04-2024]
పాలకొల్లు వైకాపా నియోజకవర్గ అభ్యర్థి గూడాల శ్రీహరిగోపాలరావు, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ప్రచారంలో పలు ప్రాంతాల్లో మహిళలకు నగదు, కానుకలు అందజేశారు -
ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆనందప్రకాశ్పై కేసు
[ 18-04-2024]
వైకాపా అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి)తో కలిసి ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లం ఆనందప్రకాశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. -
ఇక నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. దీనికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
సమరమే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఏలూరు పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు -
జగన్... నిన్ను నమ్ముకుంటే కొంప కొల్లేరు
[ 18-04-2024]
‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొల్లేరు, ఉప్పుటేరు పరిరక్షణకు చర్యలు చేపడతాం. ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర యుద్ధ ప్రాతిపదికన రెగ్యులేటర్లు నిర్మించి కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకొస్తాం’ -
ఇంకెంతన్నారు.. వేతనానికే దిక్కు లేదు
[ 18-04-2024]
వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ : కలెక్టర్
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. -
కుల బహిష్కరణ చేశారంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం
[ 18-04-2024]
సంఘం పెద్దలను నిలదీసినందుకు తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సొంతిల్లన్నారు.. నట్టేట ముంచారు
[ 18-04-2024]
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా చెబుతూ వైకాపా ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీలు, గృహాలు ప్రయోజనాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండగా, గుత్తేదారులకు మాత్రం కాసులు వర్షం కురిపించింది. -
ముహూర్తాలతో సమరానికి సై
[ 18-04-2024]
జిల్లాలో రాజకీయం వేడెక్కనుంది. గురువారం నుంచి నామపత్రాల అంకం మొదలు కానుండటంతో పూర్తిస్థాయి ఎన్నికల సందడి మొదలవనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్