విత్తనాలకేదీ భరోసా!
అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి రాయితీపై విక్రయిస్తామని, దళారుల మోసాలకు కళ్లెం వేస్తామని అధికారులు చెబుతున్నారు.
పంపిణీపై రాని స్పష్టత
దుక్కి దున్ని సాగుకు సన్నద్ధం చేసిన భూమి
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే: అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచి రాయితీపై విక్రయిస్తామని, దళారుల మోసాలకు కళ్లెం వేస్తామని అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రాల్లో చాలాచోట్ల విత్తన నిల్వలు లేవు. రాయితీపై విత్తనాల కొనుగోలుకు ఆశగా ఆర్బీకేలకు వెళ్తున్న రైతులకు అవి అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు.
కొద్ది రోజుల్లో ఖరీఫ్ ఆరంభం కానుంది. రైతులు పొలాలను దున్ని వరి సాగుకు సన్నద్ధం చేసుకున్నా ప్రభుత్వం విత్తనాల సరఫరా విషయమై నిర్ణయం తీసుకోకపోవడంతో నేటికీ అందని పరిస్థితి. ఏలూరు జిల్లాలో ఈ ఏడాది 2.67 లక్షల ఎకరాల్లో వరి సాగుకు అన్నదాతలు సన్నద్ధమయ్యారు. అయితే ఇప్పటికీ ఖరీఫ్ ప్రణాళిక ఖరారు కాలేదు. వరి విత్తనాల పంపిణీపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో గోదాములు, నిల్వ కేంద్రాలకు తరలించి మండల వ్యవసాయ కార్యాలయాలకు పంపించేవారు. ప్రస్తుతం నేరుగా ఆర్బీకేలకే సరఫరా చేస్తున్నారు. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద నారుమళ్లు పోస్తున్నారు. సమయానికి విత్తనాలు రైతులకు అందజేయకపోతే ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఆన్లైన్లో నమోదుకు ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రాలు సాంకేతిక లోపాలతో మొరాయిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిగణనలోకి తీసుకుని రైతుల అవసరం మేరకు ఆర్బీకేల్లో నిల్వ చేయాలి. చాలా చోట్ల నిల్వలు కానరావడం లేదు. ప్రతి నెలా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నిర్వహించే వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సభ్యులు విన్నవిస్తున్నా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు.
నిరాశగా వెనుదిరిగి.. ఎకరాకు 30 కిలోల చొప్పున జిల్లా రైతులకు 80,265 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం. వ్యవసాయాధికారులు 3,163 క్వింటాళ్లకు ఇండెంట్ పెట్టినా ఏలూరులోని ఏపీ సీడ్స్ కార్యాలయానికి నేటికీ చేరుకోలేదు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాల కోసం రైతులు ఆర్బీకేలకు వెళ్లి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా రైతు నుంచి రైతు విత్తనాలు తీసుకునే విధానం ఎక్కువగా ఉంటుందని ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు. మిగిలిన రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ ద్వారా పంపిణీకి 3,500 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ శారద తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపించాలి
[ 23-04-2024]
పోలవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ ఇన్ఛార్జి చిర్రి బాలరాజు కొయ్యలగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తొలిమెట్టు.. అదిరేట్టు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సత్తాచాటారు. -
మధ్యంతర భృతికి మంగళం
[ 23-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. -
ఎన్నికల ఎర.. యువత విలవిల
[ 23-04-2024]
రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 7,900 పోస్టులకు మాత్రమే డీఎసీˆ్స ప్రకటన ఇచ్చింది.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎసీˆ్స పెడతానని చెబుతున్నా.. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. -
వైకాపా మాయలోపడి రాజీనామాలు చెయ్యొద్దు: నిమ్మల
[ 23-04-2024]
వైకాపా మాయలోపడి వాలంటీర్లు రాజీనామాలు చెయొద్దని, తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు రూ.10 వేతనం ఇస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. -
గ్రంధి ఏనాడైనా పవన్లా సేవ చేశారా?
[ 23-04-2024]
ఓటమి తప్పదని తెలిసి ప్రజల దృష్టిని మరల్చడానికే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మెగా బ్రదర్స్పై ఆరోపణలు చేస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల రామమోహనరావు విమర్శించారు -
చితికిలబడింది
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా చతికిలపడింది. పునర్విభజన అనంతరం జిల్లా గత ఏడాది 22వ స్థానంలో నిలవగా.. ఈసారి 25వ స్థానానికి దిగజారింది. విద్యార్థులు 80.08 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 15.73 శాతం పెరగడం చెప్పుకోదగిన విషయం. -
ప్రగల్భాలు తప్ప.. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఏరి?
[ 23-04-2024]
గ్రామీణ ప్రజల ఇళ్ల వద్దే నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చాం. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్య విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం మాదే.. -
23వ స్థానంలో పశ్చిమ
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది -
సాయం ఎగనామం
[ 23-04-2024]
తెదేపా హయాంలో వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలతోపాటు చేతి వృత్తుల వారికి 90 శాతం రాయితీపై ఆదరణ పరికరాలిచ్చి దన్నుగా నిలిచారు. -
మీ బిడ్డనన్నావ్.. నిలువునా ముంచేశావ్!
[ 23-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాలు నిర్మించుకున్న కొందరు లబ్ధిదారులకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. 2018, 2019 సంవత్సరాల్లో వీరు పనులు ప్రారంభించగా బిల్లులన్నీ 2020లో చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు ప్రకటించింది. -
అయిదేళ్లుగా ఏటా నష్టమే!
[ 23-04-2024]
2023 డిసెంబరులో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 12,438 హెక్టార్లలో వరి, 214 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. -
అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల దాఖలు ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నరసాపురం పార్లమెంటు స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి -
హామీల వల వేసి.. ముంచేసి
[ 23-04-2024]
నవంబరు21న ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ బియ్యపుతిప్ప హార్బరు, కార్గోపోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. -
బోరుపైపు నుంచి మంటలు
[ 23-04-2024]
యలమంచిలి రెవెన్యూ పరిధిలోని కొత్తలంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక బోరు పైపు నుంచి సోమవారం మంటలు ఎగిసిపడటం కలకలం రేపింది
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?