నిధులకు నోళ్లు తెరిచిన పనులు
పల్లెల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో చేపట్టిన విలేజ్ క్లినిక్ భవనాలు కొన్నిచోట్ల పునాదుల స్థాయిలోనే ఉన్నాయి.
పూర్తి కాని విలేజ్క్లినిక్ నిర్మాణాలు
భీమవరం పట్టణం, ఆకివీడు, పాలకొల్లు గ్రామీణ, మొగల్తూరు, పోడూరు, న్యూస్టుడే: పల్లెల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసే ఉద్దేశంతో చేపట్టిన విలేజ్ క్లినిక్ భవనాలు కొన్నిచోట్ల పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. కొన్నిచోట్ల నిధులు అందినంత వరకు పనులు పూర్తిచేశారు. పలు ప్రాంతాల్లో రోగులకు వైద్య సేవలు ఎలా ఉన్నా వైద్య, సిబ్బందికే సౌకర్యాలు లేవు. రైతుభరోసా కేంద్రాలు, పాత భవనాల్లోనే సేవలు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అద్దె భారాన్ని వైద్య సిబ్బంది భరిస్తున్నారు.
బిల్లుల విడుదలలో జాప్యం.. ఒక్కో భవన నిర్మాణానికి రూ.17.5 లక్షలు తొలుత ప్రకటించారు. వీటిలో 50 శాతం ఉపాధి హామీ, మరో 50 శాతం వైద్య ఆరోగ్యశాఖ నుంచి విడుదల కావాలి. కొన్ని నెలలుగా బిల్లులు విడుదల జాప్యంతో పనులు ముందుకు సాగడంలేదు. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినట్టుగా అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సిమెంటు, రంగులు, విద్యుత్తు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించలేదు.
* పోడూరులో గత కొన్నినెలలుగా ఎలాంటి పనులూ చేయడంలేదు. ఇక్కడ సేవలు అందుబాటులోకి వస్తే దాదాపు 5వేలు మందికి ఉపయోగకరమని స్థానికులు అంటున్నారు.
చిరునామా తెలియని ప్రాంతాల్లో సేవలు
పలు ప్రాంతాల్లోని వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు చిరునామా తెలియక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నామని పలువురు చెబుతున్నారు. రైతు భరోసా, అంగన్వాడీ కేంద్రాలు, ఇతరత్రా కార్యాలయాల్లో హెల్త్క్లినిక్ల సిబ్బంది సర్దుకుపోతున్నారు. వైఎస్సార్ హెల్త్క్లినిక్ల్లో గర్భిణులు, చిన్నారులతోపాటు చిన్నపాటి రుగ్మతలతో వచ్చేవారికి సేవలు అందించాలి. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు వైద్య సేవల బాధ్యత వీరిదే. వైద్యశాఖ ఆదేశాల మేరకు ఆరోగ్య సర్వేల నివేదికలు ఇక్కడే నమోదు చేయాలి. గ్రామ జనాభాను బట్టి నిత్యం 25 నుంచి 30 మంది సద్వినియోగం చేసుకుంటారు.సేవలందించేందుకు ఎం.ఎల్.హెచ్.పి, సీహెచ్వో, ఎ.ఎన్.ఎం, ఆశ వర్కర్లు ఉండాలి.
వేగవంతం చేయిస్తాం :
సెప్టెంబరు నాటికి పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశామని పంచాయతీరాజ్ ఈఈ కె.ఎస్.ఎస్ శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం అదనంగా రూ.3.30 లక్షలు చొప్పున మంజూరయ్యాయన్నారు. వీటితో ఆయా భవనాలకు మిగిలిన పనులు పూర్తి చేయిస్తామన్నారు. పునాదుల్లో ఉన్నవాటిని కూడా వెంటనే పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటానన్నారు.
* ఆకివీడు మండలం గుమ్ములూరులో చేపట్టిన వైఎస్సార్ విలేజ్క్లినిక్ భవనం నిర్మాణ పనులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. ఇక్కడ సేవలు అందుబాటులోకి వస్తే తెరటావ, గుమ్ములూరు, అప్పారావుపేట తదితర ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. నిర్మాణం పూర్తికాకపోవడంతో కిలో మీటరు దూరంలోని పాత పంచాయతీ భవనంలో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.
* పాలకొల్లు గ్రామీణ మండలంలో 11 చోట్ల నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల పనులు ప్రారంభించలేదు. శివదేవుని చిక్కాలలో మాత్రమే భవనం కొద్దిరూపం దాల్చుకుంది. విలేజ్క్లినిక్ భవనాలు నిర్మాణం కాకపోవడంతో సమీపంలోని సచివాలయాల్లో సేవలు కొనసాగిస్తున్నారు.
* శేరేపాలెంలో నిర్మాణదశలో నిలిచిన వైఎస్ఆర్ హెల్త్క్లినిక్ భవనం ఇది. మొగల్తూరు మండలంలో 20 వైఎస్సార్ హెల్త్క్లినిక్లకు ప్రతిపాదనలు చేశారు. ముత్యాలపల్లిలో స్థలవివాదం కోర్టులో పరిధిలో ఉంది. శేరేపాలెం, కాళీపట్నంపడమర, మొగల్తూరు, రామన్నపాలెంలలో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. శేరేపాలెంలో పాతపంచాయతీ భవనంలో హెల్త్క్లినిక్ నిర్వహిస్తున్నారు. కుటుంబ వైద్యుడు సేవల్లో భాగంగా 104 వాహనం వచ్చినప్పుడే ఇక్కడ వైద్యసేవలు అందుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు