శివార్లకు జలాలు.. అవరోధంగా వ్యర్థాలు
డెల్టాలో ప్రధాన కాలువల శివారు ప్రాంతాలకు కొత్త జలాలు చేరాయి. ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం సబ్ డివిజన్ల పరిధిలోని పల్లెపల్లెకు చేరుతున్న గోదారమ్మకు పసుపు, కుంకుమలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు.
చెరువుగట్టుపాలెం కాలిబాట వంతెన దిగువున కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా వ్యర్థాలు
ఉండి, న్యూస్టుడే: డెల్టాలో ప్రధాన కాలువల శివారు ప్రాంతాలకు కొత్త జలాలు చేరాయి. ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం సబ్ డివిజన్ల పరిధిలోని పల్లెపల్లెకు చేరుతున్న గోదారమ్మకు పసుపు, కుంకుమలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాలకు తీర్చాలని వేడుకుంటున్నారు. ఈనెల ఏడో తేదీ నుంచి పెంచి విడుదల చేస్తున్న 4 వేల క్యూసెక్కుల నీటినే ప్రధాన పంట కాలువలకు పంచుతున్నారు.
ఓఅండ్ఎం నిధులతో గుత్తేదారుల నుంచి స్పందన లభించిన 67 పనులు అత్యధిక చోట్ల ప్రారంభమయ్యాయి. వీటిలో తూడు నిర్మూలన కోసం కాలువల్లోకి నీరొదలక ముందు వివిధ చోట్ల రసాయనాలు పిచికారీ చేశారు. ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు, థర్మకోల్ సీట్లు, గృహాలు, దుకాణాల్లోని చెత్తా చెదారంతో పాటు పలురకాల వ్యర్థాలు పంట కాలువలు కాలుష్య కారకాలుగా మారిపోయాయి. వాటిలో పేరుకుపోయిన అన్నిరకాల మలినాలు బయటకు పోవాలంటే తొలుత ప్రధాన కాలువ అంచుల వరకూ నీటిమట్టాన్ని పెంచడమే ప్రధాన కర్తవ్యంగా తలిచారు. దీంతో ప్రధాన కాలువల వెంబడి ఉన్న సర్ప్లస్ వియర్లు, టైల్డ్యామ్లను ఎక్కడికక్కడ మూసేసి నీటి మట్టాన్ని పెంచుతున్నారు. ఉండి ప్రధాన పంట కాలువపై చెరుకువాడ టైల్డ్యామ్తో పాటు యండగండి, ఉండి సర్ఫ్లస్ వియర్లను గత రెండ్రోజుల నుంచి మూసివేశారు. దీంతో ఉండి అక్విడక్టు వద్ద 4.3 అడుగులకు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి చేరింది. ఆ నీటిలో అక్కడక్కడా ఆక్వా కాలుష్యాన్ని వదిలేస్తున్నారు. యనమదుర్రు, బొండాడ, రుద్రాయకోడు డ్రెయిన్లల్లోని సర్ఫ్లస్ వియర్లను తెరిచిన ఉండి ప్రధాన పంట కాలువలోని కలుషిత నీటిని రెండ్రోజుల్లో వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు. వ్యర్థాలన్నీ కొట్టుకుపోతేనే ప్రధాన కాలువల్లోకి తాజా నీరొచ్చే అవకాశాలున్నాయి.
ఆ తర్వాతే ప్రక్షాళన పనులు
డెల్టాలో 368 కిలోమీటర్ల పరిధిలో 11 ప్రధాన కాలువలు ప్రవహిస్తున్నాయి. వాటితో పాటు ఉప కాలువలు 1,166 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ప్రధాన కాలువల్లో వ్యర్థాలను బయటకు పంపిన తర్వాత ఉప కాలువల ప్రక్షాళనకు చర్యలు చేపడతామని జలవనరుల శాఖ ఇంజినీర్లు వివరిస్తున్నారు. వంతెనలు, కల్వర్టులున్న ప్రాంతాల్లో తూడు, గుర్రపు డెక్క, ఇతర చెత్తా చెదారాలు అవరోధాలవుతున్నాయి. కలుషిత నీరంతా బయటకు వెళ్తే తప్ప తాగునీటి చెరువుల్లో నింపుకునే అవకాశాలు లేవు. 50 శాతం చెరువుల్లో ఇప్పటికే తాగునీటి నిల్వలు బాగా తగ్గిపోయాయి. తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జలవనరుల శాఖ శెట్టిపేట కార్యనిర్వాహక ఇంజినీరు దక్షిణామూర్తి తెలిపారు. కాలువల్లో స్వచ్ఛమైన నీరొచ్చిన వెంటనే పల్లె, పట్టణాల్లోని చెరువులు నింపుకోవాలని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా జ్వరాలపై అవగాహన
[ 25-04-2024]
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా జ్వరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. -
జగన్ దగాఖానా!
[ 25-04-2024]
గద్దెనెక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధాన సమస్యలు సైతం పరిష్కరించలేకపోయారు. సామాన్యుల వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందిస్తామని చెప్పిన జగన్.. -
అసెంబ్లీ స్థానాల్లో 35 నామినేషన్లు
[ 25-04-2024]
జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాలకు 35, పార్లమెంటు స్థానానికి ఒకటి చొప్పున నామపత్రాలు బుధవారం దాఖలయ్యాయి. -
పగిలిందా.. ఇక అంతే
[ 25-04-2024]
బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. అవి మరమ్మతులకు గురైతే మాత్రం పట్టించుకోవడం లేదు. పనిచేయని ట్యాబ్ల స్థానంలో కొత్తవి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. -
నెలాఖరు వరకే సాగునీటి సరఫరా
[ 25-04-2024]
పంట కాలువలకు నీటి సరఫరా ఈ నెల 30వ తేదీతో నిలిపివేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు వారబందీ (వంతుల వారీ విధానం)లో సాగునీటి విడుదలకు కార్యాచరణ రూపొందించారు. -
‘ఇంటి నుంచే ఓటు’కు 1133 మంది నమోదు
[ 25-04-2024]
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తపాలా బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని డీఆర్వో ఉదయభాస్కర్ తెలిపారు. తపాలా బ్యాలెట్ నమోదుపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. -
ఎన్నికల పరిశీలకురాలిగా దీప
[ 25-04-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిశీలకురాలిగా ఐఏఎస్ అధికారి దీప బాధ్యతలు చేపట్టారు. ఆమె బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
అడిగితే..అదిగో ఇదిగో!
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో పాడి రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వ హయాంలో (2017-18 వరకు) పశువు చనిపోతే పశు వైద్యాధికారి ధ్రువీకరిస్తే తక్షణమే పరిహారం చెల్లించేవారు -
వేకువ జామున ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా సన్నిహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. -
వృత్తి శిక్షణ ఉత్తిదే!
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంతో ప్రగతి పథం
[ 25-04-2024]
జగన్లా హామీలు ఇచ్చి మడమ తిప్పడం తనకు చేతకాదని.. పల్లెల్లో తాగునీరు ఇతర సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరించేలా కృషిచేస్తానని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
జనసమీకరణకు వైకాపా అగచాట్లు
[ 25-04-2024]
ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం -
తమ్మిలేరు.. వదిలేశారు
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వ విధానాలతో తమ్మిలేరు జలాశయం, అనుబంధ కాలువలకు మరమ్మతు పనులు పూర్తికావడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాలకు నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
[ 25-04-2024]
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?