భూమి పత్రాలు తీసుకెళ్లి తనఖా
భీమవరం మండలం గొల్లవానితిప్పలోని యూనియన్ బ్యాంకులో అటెండర్గా పని చేస్తూ చేతి వాటం ప్రదర్శించిన కటకంశెట్టి విజయరాజు వ్యవహారం కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.
బ్యాంకు అటెండర్ మోసం కేసులో కొత్త అంశాలు
భీమవరం గ్రామీణ, న్యూస్టుడే: భీమవరం మండలం గొల్లవానితిప్పలోని యూనియన్ బ్యాంకులో అటెండర్గా పని చేస్తూ చేతి వాటం ప్రదర్శించిన కటకంశెట్టి విజయరాజు వ్యవహారం కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు అమాయక రైతుల నుంచి డబ్బు తీసుకుని బ్యాంకులో జమ చేస్తానని మోసం చేశాడనే ఆరోపణలున్నాయి. దానిపై ‘ఈనాడు’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. ఆ బ్యాంకు రీజినల్ చీఫ్ మేనేజర్ రామ్మోహనరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. సదరు ఉద్యోగి తన ఇంటి నిర్మాణం నిమిత్తం కొన్ని లక్షలు బ్యాంకు రుణం తీసుకుని తర్వాత ఆ దస్త్రాలను దొంగిలించి తీసుకెళ్లిపోయినట్లు తేలింది. దీంతో ఇది ఈ ప్రాంతంలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక రైతు ఫిర్యాదు చేయడం వల్ల బయటపడిన ఈ వ్యవహారంలో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. ఇంకా ఎంత మంది రైతులు ఇలా మోసపోయారు.. ఆ ఉద్యోగి ఇతరుల దస్త్రాలను కూడా బయటికి తప్పించాడా అన్నదానిపై అధికారులు దృష్టి సారించారు.
* గొల్లవానితిప్పలో ఆంధ్రాబ్యాంకు(ఇప్పుడు యూనియన్ బ్యాంకు) అంటే ఈ ప్రాంతంలో సుమారు పదిహేను గ్రామాలకు ప్రధానమైంది. ఏడాదికి సుమారు రూ.150 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. అంతటి కీలకమైన బ్యాంకులో చిరుద్యోగి ఇంత పెద్ద వ్యవహారాలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది. పైగా పెద్దగా చదువుకోని రైతులు కొంత మందిని ఎక్కువగా నమ్ముతుంటారు. అందులో అటెండర్ అయిన ఉద్యోగి స్థానికుడు కావడంతో పరిసర గ్రామాల ప్రజలు అతడ్ని ఎక్కువగా నమ్మేవారని పలువురు చెబుతున్నారు. చేతివాటం బయట పడే పరిస్థితి ఉందని గమనించిన అటెండరు మార్చి నెలాఖరు నుంచి కనిపించకుండా పోయాడు. బ్యాంకు అధికారులు ఇంటికి వెళ్లినా అతడు ఎక్కడికో వెళ్లిపోయాడని, తమకు తెలియదని ఇంట్లో వారు చెబుతున్నారని బ్యాంకు అధికారులు తెలిపారు. దస్త్రాలు మాత్రమే పక్కదోవ పట్టించాడా.. బంగారం కూడా ఏమైనా పోయిందా అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. * దీనిపై తనిఖీలు చేపట్టిన రీజనల్ చీఫ్ మేనేజర్ రామ్మోహనరావు స్పందిస్తూ అతడి దస్త్రాలు తీసుకెళ్లినట్లు గుర్తించామని, ఒక చోట తనఖా పెట్టినట్లు తేలిందన్నారు. బంగారం మాత్రం భద్రంగా ఉందని, మిగిలిన దస్త్రాలు అన్నింటినీ తనిఖీ చేస్తున్నామని, ఇంకా విచారణ జరుగుతోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్