సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
విద్యుత్తు ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎలక్ట్రీసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఐదు జిల్లాల డిస్కం అధ్యక్షుడు నాగేశ్వరరావు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని గమిని ఫంక్షన్ హాలులో యూనియన్ జిల్లా కార్యవర్గ
మాట్లాడుతున్న నాగేశ్వరరావు నాయక్
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: విద్యుత్తు ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎలక్ట్రీసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఐదు జిల్లాల డిస్కం అధ్యక్షుడు నాగేశ్వరరావు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని గమిని ఫంక్షన్ హాలులో యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 22 వేల మంది కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. నాలుగు విడతల డీఏ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు కృష్ణంరాజు, జిల్లా కార్యదర్శి వి.రాము తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా