తవ్వేకొద్దీ ఇంకా..
తాడేపల్లిగూడెంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులు గల్లంతైన ఘటనపై ఇద్దరు అధికారులు సస్పెండైన విషయం మరవకముందే తప్పుడు రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటకొచ్చింది. కార్యాలయం కేంద్రంగా
తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల మాయం
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్టుడే: తాడేపల్లిగూడెంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులు గల్లంతైన ఘటనపై ఇద్దరు అధికారులు సస్పెండైన విషయం మరవకముందే తప్పుడు రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటకొచ్చింది. కార్యాలయం కేంద్రంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఆస్తులకు తప్పుడు రిజిస్ట్రేషన్ల ఘటన వెలుగు చూసింది. ఇదిలా ఉండగానే తాజాగా 71 (వాల్యూమ్స్) రిజిస్ట్రేషన్ పుస్తకాలు కనిపించడం లేదని ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ బీవీవీ సత్యనారాయణ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. కార్యాలయంలో 2012 నుంచి కంప్యూటరీకరణ అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని వాల్యూమ్స్గా భద్రపరిచారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన ప్రధాన వివరాలు వాటిల్లోనే ఉంటాయి. ఆ రికార్డులు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నెలల కిందట సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ కార్యాలయంలో స్టాంపులు, రికార్డులు, ఇతర లోటుపాట్లకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ క్రమంలోనే నాన్ జ్యుడీషియల్ స్టాంపులతో పాటు కీలకమైన 71 రికార్డులు మాయమైనట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మూడోస్థాయి విచారణ పూర్తికావాల్సి ఉంది. రికార్డులు ఎప్పుడు, ఎలా గల్లంతయ్యాయనే విషయం అధికారుల విచారణ చేస్తే తప్ప బయటపడే అవకాశం లేదు.
మరికొన్ని కార్యాలయాల్లో..
ఏలూరు వన్టౌన్, భీమడోలు, న్యూస్టుడే: తాడేపల్లిగూడెంతోపాటు జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్త్రాలు మాయమైనట్లు ప్రచారం సాగుతోంది. భీమడోలు కార్యాలయంలో పాత దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు వాటి వివరాలు నమోదు చేస్తున్నామని సబ్రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు. సమగ్రంగా దర్యాప్తు చేయాలని జిల్లా రిజిస్ట్రార్ను ఆదేశించినట్లు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ శివరాం తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ నరకం చూపించారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు -
పోలీసులందరూ జగన్ సేవకు!
[ 19-04-2024]
జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. -
తొలి రోజు ఒక్కటే నామినేషన్
[ 19-04-2024]
నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. -
నువ్వొచ్చింది మొదలు.. చెదలు
[ 19-04-2024]
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. -
జగన్.. బటన్ నొక్కినా పరిహారం దక్కలే!
[ 19-04-2024]
‘రైతులను చేయి పట్టి నడిపించే ప్రభుత్వం మాది.. సీˆజన్ ముగిసే లోగా పరిహారం అందిస్తాం.. అది కూడా నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకే..’ కర్షకులను ఉద్దేశించి సీఎం జగన్ మార్చి 6న ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. -
అయిదేళ్లూ గడ్డుకాలం
[ 19-04-2024]
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. -
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో వైద్యమంటే దేవుడిపై భారం
[ 19-04-2024]
తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి... కానీ అక్కడ అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లిగూడెంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే దేవుడిపై భారం వేయాల్సిందే. -
అడవిలో వైకాపా దొంగలు
[ 19-04-2024]
వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి
[ 19-04-2024]
కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
వైకాపాకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు : నిమ్మల
[ 19-04-2024]
కొవిడ్-19 సమయంలో ప్రజలు ప్రాణభయంతో ఉన్నప్పుడు 2022లో గోదావరి వరదలొచ్చి ఊళ్లన్నీ నీటమునిగినప్పుడు -
ఇవండీ మా ఆస్తులు.. అప్పులు
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక అంకమైన నామపత్రాల స్వీకరణ మొదలు కావటంతో ఉమ్మడి పశ్చిమలో ఎన్నికల సందడి మొదలైంది. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు
[ 19-04-2024]
వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, -
నైతిక విలువలు పెంపొందించుకోవాలి: వీసీ
[ 19-04-2024]
విద్యతో పాటు విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.తోలేటి జానకిరామ్ సూచించారు. -
21, 22 తేదీల్లో జనసేనాని ప్రచారం
[ 19-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. -
జగ న్..కర్షకుల కన్నీళ్లు పట్టవా?
[ 19-04-2024]
ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు