అయ్యా.. ఇది న్యాయమేనా!
మతిస్థిమితం లేని వ్యక్తి ఒకరు, నడవలేని స్థితిలో ఉన్నవారు మరొకరు.. ఇలాంటి వారు తమకు నెలవారీ పింఛన్లు నిలిపేశారంటూ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో వాపోయారు.
నిలిచిన పింఛనుతో వెతలు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: మతిస్థిమితం లేని వ్యక్తి ఒకరు, నడవలేని స్థితిలో ఉన్నవారు మరొకరు.. ఇలాంటి వారు తమకు నెలవారీ పింఛన్లు నిలిపేశారంటూ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో వాపోయారు.
ఎన్నిసార్లు విన్నవించినా.. మాది ఏలూరు నగరం. మా మరిది ఇల్షాద్ హుస్సేన్కు పుట్టుకతోనే అంగవైకల్యం ఉంది. దివ్యాంగుల కేటగిరీలో నెలవారీ పింఛను సొమ్ము అందేది. సాంకేతిక సమస్యతో నాలుగు నెలల నుంచి ఆపేశారు. అధికారుల చుట్టూ తిరిగినా పింఛను పునరుద్ధరించడం లేదు. -షాహినా ఫర్వీ
కొత్తగా కార్డు పొందినా.. నేను ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో ఉంటున్నా. పండు వయసులో ఉన్నా. పింఛను సొమ్మే ఆధారం. బియ్యం కార్డులో పేర్లున్న ఇద్దరికి వస్తున్నాయనే కారణంతో నాలుగు నెలల కిందట నిలిపేశారు. కొత్తగా బియ్యం కార్డు పొందా. అయినా మంజూరుచేయడం లేదు. గత నెలలోనూ ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదు చేశా. ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలి. -కాంతమ్మ, తిరుమలంపాలెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!