Crime News: చిట్టీల పేరుతో రూ.7కోట్ల మోసం!

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో చిట్టీల పేరుతో చేసిన భారీ మోసం బయటపడింది.

Updated : 07 Dec 2021 12:22 IST

నిడదవోలు: పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో చిట్టీల పేరుతో చేసిన భారీ మోసం బయటపడింది. గ్రామానికి చెందిన తిరుమళ్ల రంజిత్ కుమార్ రూ.7కోట్లకు ఎగనామం పెట్టి పరారయ్యాడని బాధితులు వాపోతున్నారు. రంజిత్ ఎన్నో ఏళ్లుగా ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం చేస్తున్నాడని.. నమ్మి చిట్టీలు వేస్తే మోసం చేశాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు. అతడికి ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని.. ఇంటికెళ్తే తాళాలు వేసి ఉన్నాయని బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చిట్టీల పేరుతో మోసపోయిన కొందరు బాధితులు తమకు ఫిర్యాదు చేశారని సమిశ్రగూడెం ఎస్ఐ షేక్ సుభాని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని