logo

త్రుటిలో తప్పిన ప్రమాదం

జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. జంగారెడ్డిగూడెం నుంచి ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం ప్రయాణికులతో విజయవాడ బయలుదేరింది. గురవాయిగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ముందు వెళుతున్న

Published : 23 Jan 2022 03:53 IST

అద్దాలు పగిలిన ఆర్టీసీ బస్సు

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. జంగారెడ్డిగూడెం నుంచి ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం ప్రయాణికులతో విజయవాడ బయలుదేరింది. గురవాయిగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ముందు వెళుతున్న ఊక లారీ చోదకుడు అకస్మాత్తుగా బ్రేకులు వేశారు. దీంతో బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. లారీ వెనుక ఉన్న కర్రలను బలంగా తాకడంతో బస్సు ముందు భాగం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని