logo

నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలి: ఎమ్మెల్యే

ప్రభుత్వ భవనాలను నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కోరారు. పెదవేగి మండలం ముండూరులో నిర్మిస్తున్న సొసైటీ గోదాము భవన నిర్మాణాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు గ్రామ సచివాలయాన్ని సందర్శించి

Published : 23 Jan 2022 03:53 IST

మాట్లాడుతున్న అబ్బయ్యచౌదరి

ముండూరు (పెదవేగి), న్యూస్‌టుడే: ప్రభుత్వ భవనాలను నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కోరారు. పెదవేగి మండలం ముండూరులో నిర్మిస్తున్న సొసైటీ గోదాము భవన నిర్మాణాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. అనంతరం గ్రామస్థులతో ఆయన సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. కె.కన్నాపురంలోని జగనన్నకాలనీని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో పెదవేగి ఎంపీపీ తాతా రమ్య, జడ్పీ వైస్‌ఛైర్మన్‌ పెనుమాల విజయ్‌బాబు, ముండూరు సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌ చెరుకూరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. 

మృతుల కుటుంబాలకు పరామర్శ

సోమవరప్పాడు(దెందులూరు), న్యూస్‌టుడే: దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి చల్లపల్లి, సోమవరప్పాడు గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు కారణాలు చేత మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద పూలు చల్లి నివాళులు అర్పించారు. ఆయా గ్రామాల్లో గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని