కొవిడ్ వేళసంక్షేమనికి ప్రాధాన్యం
కొవిడ్ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. గణంతంత్ర వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏలూరు పోలీసు పరేడ్ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వంద
ఘనంగా గణతంత్ర వేడుకలు
జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తున్న కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, డీఐజీ మోహనరావు
కొవిడ్ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. గణంతంత్ర వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏలూరు పోలీసు పరేడ్ మైదానంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.పోలీసు కవాతును పరిశీలించారు. జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. జిల్లా జడ్జి భీమారావు, ఎమ్మెల్సీ సాబ్జీ, ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, జేసీలు హిమాన్షు శుక్లా, అంబేడ్కర్, శిక్షణ కలెక్టర్ రాహుల్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - న్యూస్టుడే, ఏలూరు అర్బన్
ఉత్తమ శాఖలకు రోలింగ్ షీల్డ్స్.. వివిధ శాఖల ప్రగతి, పనితీరు ఆధారంగా రోలింగ్ షీల్డ్లను అందజేశారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖలకు ప్రథమ, ద్వితీయ, స్థానాలు లభించాయి. ఏలూరు మండలం శనివారపుపేట, అత్తిలి సచివాలయాలకు రోలింగ్ షీల్డ్లను అందజేశారు. రెవెన్యూ శాఖలో ఉత్తమ అధికారిణిగా ఆర్డీవో పి.రచన, పోలీసు శాఖలో కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావులకు ఉత్తమ అధికారులుగా పురస్కారాలను అందజేశారు. పోలీసు కవాతులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన స్కాట్లాండ్ బ్యాగ్పైపర్ బృందానికి బహుమతి అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లను ప్రదర్శించారు. ఆయా పథకాల లబ్ధిదారులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.
త్యాగధనుల జీవితాలు స్ఫూర్తిదాయకం.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల జీవితాలు స్ఫూర్తిదాయకమని డీఐజీ మోహనరావు అన్నారు. స్థానిక డీఐజీ విడిది కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని డీఐజీ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఏఎస్పీ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ● స్థానిక ఎస్పీ విడిది కార్యాలయంలో ఎస్పీ రాహుల్దేవ్ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. త్యాగధనుల కృషితోనే స్వాతంత్య్రం.. ● ఎంతోమంది త్యాగధనులు చేసిన కృషివల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని జిల్లా జడ్జి భీమారావు అన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని భీమారావు ఎగురవేసి గౌరవ వందనం చేశారు. జిల్లా అదనపు జడ్జి టి.మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వి.శ్రీనివాసులు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ● తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ప్రాంగణంలో డైరెక్టర్ సీఎస్ఫీరావు జెండా ఆవిష్కరించారు.
కవాతు చేస్తున్న పోలీసులు
ప్రగతిని ప్రతిబింబించిన శకటాలు.. జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించేలా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖ, గృహ నిర్మాణ సంస్థ, వ్యవసాయ శాఖలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శర్వాణీ, వెస్ట్ బెర్రీ, కేజీబీవీ పాఠశాలలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాయి.
గిరిజనుల నృత్య ప్రదర్శన
శర్వాణీ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనకు మొదటి బహుమతి
ప్రథమ స్థానం పొందిన వైద్య, ఆరోగ్య శాఖ శకటం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేనా ‘భవిత’వ్యం
[ 29-03-2024]
ప్రత్యేక అవసరాల పిల్లలను విద్య, ఆరోగ్యపరంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చే వారికి ప్రాథమిక విద్యాంశాలు నేర్పించడం, ఫిజియోథెరపీ సేవలు అందిస్తూ వారిని సాధారణ స్థాయికి తీసుకువచ్చి బడుల్లో చేర్పిస్తుంటారు. -
చేలకు నీరు.. చేరని తీరు
[ 29-03-2024]
జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. -
వైకాపాలో లుకలుకలు
[ 29-03-2024]
కామవరపుకోట ఎంపీపీ మేడవరపు విజయలక్ష్మి తన పదవి, వైకాపా పదవులకు రాజీనామా చేయడం మండలంలో కలకలం రేపింది. వర్గ విభేదాలు.. రాజీనామా వ్యవహారంతో పార్టీలో లుకలుకలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. -
మహిళలు ముందుకొచ్చి పోరాడాలి
[ 29-03-2024]
తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. -
నరసాపురం నుంచి పోటీలో ఉంటా : రఘురామ
[ 29-03-2024]
నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటానని, ఇందుకు సంబంధించి త్వరలో స్పష్టత వస్తుందని ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం సాయంత్రం యన రాజమహేంద్రవరం నుంచి భీమవరం చేరుకున్నారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు
[ 29-03-2024]
రాష్ట్రంలో విధ్వంసకర అవినీతి పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తణుకులో సీఎం కన్వెన్షన్ హాలులో గురువారం నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. -
చెరువులు మాయం
[ 29-03-2024]
తాగునీటి చెరువులకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఇంటి, వ్యవసాయ, ఇతర అవసరాలకు చెరువుల వైపే చూసేవారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి కుళాయి అందుబాటులోకి రావడంతో తటాకాలు మరుగున పడ్డాయి. -
శుద్ధ జలం.. అందని దైన్యం!
[ 29-03-2024]
మన్యం గ్రామాల్లోని గిరిజనులకు శుద్ధి జలం అందించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధి జల కేంద్రాలు నిర్వహణ లోపం కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. -
రూ.5 పెరిగిన పొగాకు ధర
[ 29-03-2024]
ఎన్ఎల్ఎస్లోని గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం గరిష్ఠ ధర కేజీకి రూ.5 పెరిగి రూ.240 నుంచి రూ.245కు చేరింది. ఒక్క బేలుకు మాత్రమే ఈ పెరుగుదల నమోదైంది. -
వంద నిమిషాల్లో పరిష్కారం
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు చేసే ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరిస్తున్నట్లు ఆ యాప్ నోడల్ అధికారి కృపావరం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్