సొమ్ములు రాక.. పెట్టుబడి లేక
జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాలేదు. మరోపక్క ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ము జమకాకపోవడంతో రబీ సాగుకు పెట్టుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
44 శాతం రైతులకు అందని ధాన్యం డబ్బు
ఉండిలో ఒక మిల్లులో నిల్వ చేసిన ధాన్యం బస్తాలు
భీమవరం వ్యవసాయ విభాగం, న్యూస్టుడే: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాలేదు. మరోపక్క ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ము జమకాకపోవడంతో రబీ సాగుకు పెట్టుబడి లేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
నిర్ణీత లక్ష్యంలో 71.63 శాతం ధాన్యాన్నే అధికారికంగా సేకరించగలిగారు. మిగిలిన 28.37 శాతం పంట రైతుల వద్దే ఉందని యంత్రాంగం చెబుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే కొంత మినహా ధాన్యమంతా సాగుదారుల నుంచి వ్యాపారుల వద్దకు చేరినట్లు స్పష్టమవుతోంది. విక్రయించిన ధాన్యం సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో పడలేదంటూ కొనుగోలు కేంద్రాల చుట్టూ రైతులు నిత్యం తిరుగుతూనే ఉన్నారు.
జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగైంది. గత నవంబరులో అధిక వర్షాల కారణంగా దిగుబడులు బాగా తగ్గిపోయాయి. డెల్టాలో పంట కాలువలు, డ్రెయిన్లకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 20-25 బస్తాల దిగుబడి కూడా గగనమైపోయింది. మరోవైపు నీటి లభ్యత తగ్గిపోతుండటంతో రబీ పనులు వెనువెంటనే చేపట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి దశలో ఒడ్డుకు చేరిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ, గింజలో నాణ్యతా లోపాలు తదితర సమస్యలు ఎదురైన ప్రాంతాల్లో పంటను కల్లాల్లోనే వ్యాపారులకు విక్రయించినట్లు రైతులు చెబుతున్నారు. దిగుబడి బాగున్నచోట సైతం సాగు కోసం పెట్టుబడి పెట్టిన వ్యాపారులకే ధాన్యాన్ని అప్పగించారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లోనే పంట విక్రయించుకోవాలని అధికారికంగా సూచించారు. ఆన్లైన్లో నమోదు ప్రక్రియ అంతా ఈ కేంద్రాల్లోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. పంట మాత్రం కేటాయించిన మిల్లులకు లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో నేరుగా చేరుతోంది.
ఇదీ పరిస్థితి.. ధాన్యం విక్రయించిన 21 రోజులకు సంబంధిత రైతు ఖాతాల్లో నగదు జమ అవుతోందని అధికారులు చెబుతున్నారు. కానీ 30- 40 రోజుల దాటిపోయినా నగదు జమకాలేదని పలువురు సాగుదారులు వాపోతున్నారు. ఆన్లైన్లో సాంకేతిక సమస్యల వల్ల మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదని ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీరో బ్యాలెన్స్ ఖాతాలు కొన్నిచోట్ల వినియోగంలో లేకపోవడం, ఆధార్ అనుసంధానం చేయకపోవడం, ఫోన్ నెంబరు లింకేజీ కాకపోవడం తదితర సాంకేతిక సమస్యలు రైతులకు శాపాలుగా మారుతున్నాయని చెబుతున్నారు. వీటిని సరిదిద్దుకుంటే తప్ప సొమ్ము పడని పరిస్థితి. మరోపక్క రబీ నాట్లు పూర్తి చేసి వెనువెంటనే ఎరువులు చల్లాల్సిన దశలో కొత్త పెట్టుబడుల కోసం అన్నదాతలు అనేక పాట్లు పడుతున్నారు. పంట విక్రయించిన రైతుల్లో దాదాపు 44 శాతం మంది సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు.
సాంకేతిక లోపాలే కారణం
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయి. పంట విక్రయించిన 21 రోజుల తర్వాత రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతోంది. బ్యాంకు ఖాతాల నిర్వహణ సరిగా లేనిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని సరిచేసుకోవాలని రైతులకు తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారం వరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయి. ఈ లోపే లక్ష్యం మేర కొనుగోళ్లు పూర్తిచేస్తాం.- దాసి రాజు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ స్థానానికి ఏడు నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక మంగళవారం అత్యధికంగా నామపత్రాలు దాఖలయ్యాయి. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 దాఖలయ్యాయి. -
అడిగితే కేసుల.. వేధింపులా
[ 24-04-2024]
‘ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. వేతనాలు పెంచుతా’ అంటూ గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి తుంగలో తొక్కారు. -
అన్నీ గాలి కబుర్లే..
[ 24-04-2024]
ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. -
ఊడుతున్న ఫ్యాను రెక్కలు
[ 24-04-2024]
అధికార వైకాపాలో అసమ్మతి సెగ పెరుగుతోంది. ఫ్యాను రెక్కలు ఊడి పడుతున్నాయి. కీలక నేతలు ఎన్నికలకు ముందే పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ వైకాపాలో రాజీనామాల కాక రేగుతోంది. ఎప్పుడు.. ఎవరు పార్టీని వీడతారో అని అధికార పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఒత్తిళ్లకు కదిలి.. అయిష్టంగా వదిలి
[ 24-04-2024]
అయిదేళ్లుగా క్షేత్రస్థాయిలో కష్టపడ్డాం. ప్రతి పథకాన్నీ ఇంటింటికీ చేర్చాం. తీరా ఎన్నికలు వచ్చేసరికి రాజీనామా చేయాలంటూ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. తప్పించుకుని తిరిగినా వెంటాడి మరీ రాజీనామా చేయించారు. -
హామీలపై జగన్ పార్టీని నిలదీయండి
[ 24-04-2024]
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను దౌర్జన్యంగా లాగేసుకోవడానికే సీఎం జగన్రెడ్డి భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చారని.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, ప్రాణాలకు సైతం రక్షణ ఉండదని నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కె.రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
బొబ్బిలి వంతెన బోరుమంటోంది!
[ 24-04-2024]
గణపవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న బొబ్బిలి వంతెన దుస్థితి ఇది. 50 గ్రామాల ప్రజలకు వారధిగా, నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే దీని నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
ఏదీ ‘మంచి’గా ఇవ్వ‘నీ’య‘రు’
[ 24-04-2024]
తక్కువ ఖర్చుతో పేదలకు శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’కి వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. -
జోరుగా నామినేషన్లు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామపత్రాల సమర్పణ కొనసాగుతోంది. మంగళవారం ఏలూరు ఎంపీ స్థానానికి ముగ్గురు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 26 మంది దాఖలు చేశారు. భీమవరంలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి 7, అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అందజేశారు. -
వీల్ఛైర్ కావాలా? ‘సాక్ష్యం’లో దరఖాస్తు చేయండి
[ 24-04-2024]
మీరు దివ్యాంగులా? వృద్ధులా? నడవలేని స్థితిలో ఉన్నారా? పోలింగు కేంద్రం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం మీకోసం వీల్ఛైౖర్ ఏర్పాటుచేస్తుంది. ఇందుకోసం ‘సాక్ష్యం’ అనే యాప్లో దరఖాస్తు చేసుకోవాలి. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి లక్ష్మీపురం కాలనీలో నివసించే మేలురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదురు ఫ్లాట్లో అల్లూరి శరత్చంద్రవర్మ కుటుంబం అద్దెకు దిగింది. -
అసలు కోడ్ ఉందా?
[ 24-04-2024]
పాలకొల్లులో ఆర్వో కార్యాలయం పక్కనే ఉన్న భవనంపై ఉన్న సీఎం జగన్ సిద్ధం ఫ్లెక్సీ ఇప్పటికీ తొలగించలేదు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఫ్లెక్సీని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. -
వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలు
[ 24-04-2024]
వైకాపా పాలనలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఆరోపించారు. మంగళవారం కైకలూరులో కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మాటల మేడలు కట్టేసి.. స్మార్ట్గా చేతులెత్తేసి!
[ 24-04-2024]
మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. -
మంచి చేస్తానని ముంచేసి..
[ 24-04-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.10,500, ఆయా, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ.7,500 చెల్లించే వారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం కన్నా రూ.1000 అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు