కాలువలకు..వచ్చేనా మంచి రోజులు?
జిల్లా వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పంట కాలువలన్నీ అధ్వానంగా తయారయ్యాయి. మురుగుకాలువలైతే మరింత దారుణంగా మారాయి. ఎక్కడికక్కడ తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయి నీరు ముందుకు కదలనంటోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన
గుత్తేదారులు ముందుకొస్తేనే పనులు
తూడుతో నిండి ఉన్న రాయలం డ్రెయిన్
భీమవరం అర్బన్, న్యూస్టుడే జిల్లా వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పంట కాలువలన్నీ అధ్వానంగా తయారయ్యాయి. మురుగుకాలువలైతే మరింత దారుణంగా మారాయి. ఎక్కడికక్కడ తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయి నీరు ముందుకు కదలనంటోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రానున్నది వర్షాకాలం.. వాటి పరిస్థితి ఇప్పుడున్నట్లే ఉంటే పొలాలు చాలా వరకు ముంపునకు గురవుతాయి. పలు నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి. ప్రస్తుతం పనులు జరుగుతాయో లేదో అనే అనుమానం ప్రజల్లో నెలకొని ఉంది. పంట కాలువలు, మురుగు కాలువల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) కింద ప్రస్తుతం నిర్వహించాల్సిన పనులు చేసేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో చేసిన పనులకే బిల్లులు రాలేదని కొందరు ఇప్పుడు చేసినా ఇస్తారనే గ్యారంటీ లేదని మరికొందరు వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది జరగాల్సిన కాలువల పనులపై సందిగ్ధం నెలకొంది. అసలు ఈ సీజన్లో పనులు జరుగుతాయా అనే అనుమానాలు అటు ప్రజల నుంచి, ఇటు అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దేవరకోడు, గునుపూడిసౌత్, బొండాడ, రాయలం, గొంతేరు, మొగల్తూరు తదితర డ్రెయిన్లు దారుణంగా ఉండి వాటి పరిధిలో ముంపు ముప్పు పొంచి ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గోస్తనీ వేల్పూరు, నరసాపురం, ఉండి, అత్తిలి, వెంకయ్యవయ్యేరు, లోసరి తదితర పంట కాలువల పరిస్థితి అదే విధంగా ఉంది.
* కాలువల్లోకి నీరు విడుదల చేసే సమయం దగ్గరికొచ్చినా కాలువల ప్రక్షాళన పనులు ఎందుకు చేయలేకపోతున్నారు. రాబోయే రోజులు ఎంతో ముఖ్యం. ముఖ్యమైన పనులన్నీ త్వరితగతిన చేయించండి. - భీమవరంలో బుధవారం జరిగిన జిల్లా సాగునీటి పారుదల సమావేశంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
* బిల్లులు రావడం లేదని గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడం లేదు సార్. - జలవనరుల శాఖ అధికారులు ఇచ్చిన సమాధానం
* ఇటీవల బిల్లులు పొందిన గుత్తేదారులను పిలిచి మాట్లాడి వారితోనే ఆ పనులు చేయించండి.. బిల్లులు ఇప్పించే పని నేను చూసుకుంటా.. ఈ ఏడాది చేసిన పనులకు పెండింగులు ఉండవు. - ఉప ముఖ్యమంత్రి హామీ
* ఈ నెల 23న ఇప్పటికే పిలిచిన టెండర్లను తెరవనున్నాం. పనులు చేయిస్తాం. - జలవనరుల శాఖ అధికారులు
అధ్వానంగా ఉన్న లోసరి పంట కాలువ
పనులు చేయించేలా..
ఈ నెల 23న టెండర్లు తెరవగానే గుత్తేదారులతో మాట్లాడి 24 నుంచి పనులు ప్రారంభించేలా మా వంతు కృషి చేస్తున్నాం. ముఖ్యంగా పంట, మురుగు కాలువలన్నింటిలో తూడు తొలగింపు పనులు కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. నాగార్జునరావు, జలవనరుల శాఖ జిల్లా అధికారి, భీమవరం
ఇదీ పరిస్థితి..
* మొత్తం 27 మురుగు కాలువల్లో పూడిక తీసేందుకు టెండర్లు పిలవగా 17 పనులకు మాత్రమే స్పందన వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఓఅండ్ఎం కింద ఇప్పుడు మురుగు కాలువల్లో తూడు తొలగించేందుకు 32 పనులకు రూ.6.84 కోట్లు కేటాయించారు.
* పంట కాలువలకు సంబంధించి గతంలో 64 పనులకు టెండర్లు పిలవగా 20 పనులకు మాత్రమే గుత్తేదారుల నుంచి స్పందన వచ్చింది. తాజాగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద రూ.4.46 కోట్లు కేటాయించారు. 42 పనులుగా విభజించి ఇటీవల టెండర్లు పిలిచారు.
* తూడు తొలగింపునకు 74 పనులకు ఈ నెల 23న టెండర్లు తెరవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. లేదంటే ఈ సీజన్లోనూ రైతులకు తీవ్ర నష్టం తప్పకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు బజార్లకు పైసా విదల్చని జగన్
[ 20-04-2024]
జగన్ పార్టీ పేరులో మాత్రం ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్’ అంటూ హాలికుడికి అగ్రతాంబూలం కట్టబెట్టారు. వారిని మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు. రైతుకు ఉపాధి.. ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రారంభించిన రైతు బజార్లను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
వారం అన్నావ్.. వమ్ము చేశావ్
[ 20-04-2024]
‘ తెదేపా సర్కారు అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోలేదు. వచ్చేది మనందరి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అందరికీ న్యాయం చేస్తాం. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లిస్తాం.’.. -
చిమిడిన అన్నం.. చిక్కీలు లేవు
[ 20-04-2024]
జగనన్న గోరుముద్దంటూ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేస్తున్నా పాఠశాలల్లో చాలా మంది పిల్లలు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. -
కరవు భత్యానికీ కరవే
[ 20-04-2024]
అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
జోరుగా నామినేషన్లు
[ 20-04-2024]
ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. -
రాష్ట్రమంతటా కూటమి పవనాలు
[ 20-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ పేర్కొన్నారు. -
వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
[ 20-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు అన్నారు. -
ప్రచారం తప్ప.. ప్రగతి లేదు
[ 20-04-2024]
భీమవరం ఏడో వార్డు పరిధి మారుతీనగర్లో గత అయిదేళ్లలో అభివృద్ధి జాడలు కనిపించడంలేదు. గత పాలకమండలి హయాంలో ఆమోదం పొందిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి చేసినవి మినహా కొత్తగా చేపట్టినవి లేవు. -
పార్లమెంట్కు 2, అసెంబ్లీకి 6
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు శుక్రవారం నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొకినాల కోటేశ్వరరావు నామపత్రాలను సమర్పించారు. -
శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
వర్జీనియా పొగాకు గరిష్ఠ ధర రూ.263
[ 20-04-2024]
వర్జీనియా పొగాకుకు శుక్రవారం నాటి వేలంలో కిలో రూ.263 గరిష్ఠ ధర లభించింది. గత కొన్ని రోజులుగా పొగాకు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. -
రామరాజుకు అధిష్ఠానం పిలుపు
[ 20-04-2024]
ఉండి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది. ఈ సీటును నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్